తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా X ఇరాన్ : 'యూఎస్​ సైనికులంతా తీవ్రవాదులే' - అమెరికా X ఇరాన్ : 'యూఎస్​ సైనికులంతా తీవ్రవాదులే'

ఖాసీం సులేమానీ మరణంతో అమెరికాపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న ఇరాన్​ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఖాసీం హత్యలో భాగమైన వారితో పాటు మొత్తం అమెరికా సైనికులందరినీ తీవ్రవాదులుగా గుర్తించింది. ఈ మేరకు ప్రవేశపెట్టిన బిల్లుకు ఇరాన్​ పార్లమెంట్​ ఆమోదం తెలిపింది.

Iran designates US forces 'terrorists' for killing general
అమెరికా X ఇరాన్ : 'యూఎస్​ సైనికులంతా తీవ్రవాదులే'

By

Published : Jan 7, 2020, 5:12 PM IST

అమెరికా సైనికులందరినీ ఉగ్రవాదులుగా గుర్తించింది ఇరాన్​ పార్లమెంట్​. ఈ మేరకు ప్రవేశపెట్టిన బిల్లుకు ఆ దేశ చట్టసభ సభ్యులు ఆమోదం తెలిపారు. తమ దేశ ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే రివల్యూషనరీ కుద్స్​ ఫోర్స్​ విభాగాధిపతి జనరల్​ సులేమానీ హత్యకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చూడండి : అంతిమ యాత్రలో తొక్కిసలాట- 35 మంది మృతి

పార్లమెంట్​ ఆమోదించిన ఈ బిల్లు ప్రకారం.. అమెరికా సైనికులు, పెంటగాన్​తో పాటు దాని అనుసంధాన సంస్థల ఉద్యోగులు, సులేమానీ హత్యలో భాగమైన ఏజెంట్లు, కమాండర్లను ఇరాన్​ తీవ్రవాదులుగా పరిగణించింది. యూఎస్​ సైన్యానికి ఎలాంటి సాయం చేసినా... ఉగ్రవాదులకు సహకరించినట్లుగానే పరిగణిస్తామని ఆ దేశ​ పార్లమెంట్​ స్పష్టం చేసింది.

సులేమానీ నేతృత్వంలో నడిచిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్​ కుద్స్​ ఫోర్స్​కు ఆర్థిక కేటాయింపులను 200 మిలియన్ యూరోలకు పెంచేందుకు ఇరాన్ చట్టసభ సభ్యులు అంగీకారం తెలిపారు.

For All Latest Updates

TAGGED:

Gangadhar Y

ABOUT THE AUTHOR

...view details