తెలంగాణ

telangana

ETV Bharat / international

పాకిస్థాన్​కు 597 కోట్ల డాలర్ల జరిమానా..! - TCC

పాకిస్థాన్​ ప్రభుత్వంపై అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం కొరడా ఝుళిపించింది. రెకో డిక్​ ప్రాజెక్టు కోసం టీసీసీ సంస్థకు మైనింగ్​ లీజును చట్టవిరుద్ధంగా తిరస్కరించినందుకు ఏకంగా 597 కోట్ల డాలర్ల జరిమానా విధించింది.

పాకిస్థాన్​కు 597 కోట్ల డాలర్ల జరిమానా..!

By

Published : Jul 15, 2019, 7:13 AM IST

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్థాన్​కు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2011లో బలూచిస్థాన్​లోని రెకో డిక్ ప్రాజెక్టు కోసం టెథియాన్​ కాపర్​ కంపెనీ (టీసీసీ)కి మైనింగ్ లీజును చట్టవిరుద్ధంగా తిరస్కరించినందుకు ఏకంగా 597 కోట్ల డాలర్ల భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

టీసీసీ మైనింగ్​ లీజు అభ్యర్థనను బలూచిస్థాన్​ ప్రభుత్వం తిరస్కరించినందుకు 2011 నవంబర్​లో రెకో డిక్​ ప్రాజెక్టు పనులు అర్థంతరంగా ఆగిపోయాయి. తద్వారా తమకు 114.3 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని టీసీసీ తెలిపింది. పాక్​ ప్రభుత్వానికి, తమకు మధ్యనున్న ఈ వివాదంలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వం కోసం.. 2012 జనవరి 12న 'ఇంటర్నేషనల్​ సెంటర్​ ఫర్​ సెటిల్మెంట్​ ఆఫ్​ ఇన్వెస్ట్​మెట్​ డిస్ప్యూట్స్'​(ఐసీఎస్​ఐడీ) ముందు పిటిషన్​ దాఖలు చేసింది.

అనంతరం అదే ఏడాది జులై 12న ఈ వివాదంపై ట్రిబ్యునల్​ ఏర్పాటు చేసింది ఐసీఎస్​ఐడీ. తాజాగా ఈ అంశంపై తీర్పు వెలువరించింది అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం. దాదాపు ఏడేళ్లపాటు సాగిన ఈ వివాదంలో పాక్​ ప్రభుత్వంపై టీసీసీనే నెగ్గింది.

ఇదీ చూడండి : చంద్రయాన్​-2 ప్రయోగం మళ్లీ ఎప్పుడు?

ABOUT THE AUTHOR

...view details