ఇండోనేషియాలో సైనిక హెలికాప్టర్ కూలిపోయింది. ప్రమాద సమయంలో విహాంగంలో పైలట్ సహా తొమ్మిది మంది సైనికులు ఉన్నారు. అందులో నలుగురు జవాన్లు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
కుప్పకూలిన సైనిక హెలికాప్టర్.. నలుగురు జవాన్లు మృతి - latest accident news
ఇండోనేషియాలో సైనిక హెలికాప్టర్ కూలిన ఘటనలో నలుగురు సైనికులు మరణించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు అధికారులు.
![కుప్పకూలిన సైనిక హెలికాప్టర్.. నలుగురు జవాన్లు మృతి Indonesian army helicopter crashes, killing 4](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7508758-845-7508758-1591461826842.jpg)
కూలిన ఆర్మీ హెలికాఫ్టర్.. నలుగురు మృతి
రష్యాకు చెందిన ఎంఐ 17 హెలికాఫ్టర్ తొమ్మిది మంది సైనికులను.. శిక్షణలో భాగంగా తీసుకెళ్తుండగా జావా ప్రధాన ద్వీపంలో శనివారం అకస్మాత్తుగా మంటలు చెలరేగి నేలకూలినట్లు అనుమానిస్తున్నారు. అయితే.. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.