తెలంగాణ

telangana

ETV Bharat / international

73కు పెరిగిన ఇండోనేసియా భూకంప మృతుల సంఖ్య - Indonesia quake death toll rises to73

ఇండోనేసియా భూకంప మృతుల సంఖ్య 73కు పెరిగింది. ప్రమాదంలో 800 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఎక్కువ మరణాలు మముజు ప్రాంతంలో సంభవించాయని అధికారులు తెలిపారు.

Indonesia quake death toll rises to 56
56కు పెరిగిన ఇండోనేషియా భూకంప మృతుల సంఖ్య

By

Published : Jan 17, 2021, 4:40 PM IST

Updated : Jan 17, 2021, 7:50 PM IST

ఇండోనేసియాలో ఇల్లు, భవనాల శిథిలాల కింద చిక్కుకున్న మరిన్ని మృత దేహాలను సహాయ బృందాలు ఆదివారం వెలికితీశాయి. దాంతో భూకంపంలో మరణించిన వారి సంఖ్య 73కు చేరింది. కాగా 800మందికి పైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.

ఒక్క మముజు ప్రాంతంలోనే భూకంప ధాటికి 64 మంది మృతిచెందారు. పక్క జిల్లా మజేనాలో 9 మంది చనిపోయారు. 27,850 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. ఆహార పదార్థాలు అందజేసేందుకు దెబ్బతిన్న రోడ్లను సహాయక బృందాలు మరమ్మతు చేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. విద్యుత్​, సమాచార సరఫరాను పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.

సులవేసి రాష్ట్రంలో అధికారులు అత్యవసర పరిస్థితి విధించారు. రెండు, మూడు వారాల తర్వాత అత్యవసర పరిస్థితిని ఎత్తివేస్తామని బీఎన్​డీపీబీ అధ్యక్షుడు డోని మోరాండో తెలిపారు.

ఇదీ చూడండి:ఇండోనేసియా భూకంపంలో 46కు చేరిన మృతులు

Last Updated : Jan 17, 2021, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details