తెలంగాణ

telangana

By

Published : May 27, 2020, 8:34 PM IST

ETV Bharat / international

భారత్​తో పొరుగు దేశాలకు ప్రమాదం: ఇమ్రాన్​

చైనాకు వత్తాసు పలుకుతూ భారత్​పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్. సరిహద్దు విస్తరణకు భారత్​ చేపట్టే అహంకారపూరితమైన విధానాల వల్ల పొరుగు దేశాలకు ముప్పు తలెత్తుతోందని ట్వీట్ చేశారు.

India's 'arrogant expansionist policies' becoming 'threat' to its neighbours: Pak PM Khan
చైనాకు వత్తాసు పలుకుతూ భారత్​పై ఇమ్రాన్​ తీవ్ర వ్యాఖ్యలు

భారత్​పై ఎప్పుడూ అక్కసువెళ్లగక్కే పాకిస్థాన్ మరోమారు తన వక్రబుద్ధిని చాటుకుంది. తన శాశ్వత మిత్రదేశమైన చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ భారత్​పై తీవ్ర ఆరోపణలు చేసింది. భారత్​-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. సరిహద్దును విస్తరించుకోవడానికి భారత్​ పాటిస్తున్న విధానాల వల్ల పొరుగు దేశాలకు ప్రమాదం ఏర్పడిందని ఆరోపిస్తూ వరుస ట్వీట్లు చేశారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.

"సరిహద్దును విస్తరించడానికి భారత్ చేపట్టే అహంకారపూరితమైన విధానాలు పొరుగు దేశాలకు ముప్పు తెస్తున్నాయి. పౌరసవరణ చట్టం ద్వారా బంగ్లాదేశ్​తో, నేపాల్​- చైనాలతో సరిహద్దు వివాదం, అసాంఘిక కార్యకలాపాల ఆరోపణలతో పాక్​తో బెదిరింపులకు పాల్పడుతోంది భారత్.​"

-ఇమ్రాన్ ఖాన్​, పాకిస్థాన్​ ప్రధాని​.

పాకిస్థాన్-చైనాలు ఎల్లవేళలా స్నేహపూర్వకంగా ఉంటాయి. అనేక విషయాల్లో పరస్పరం సహకరించుకుంటాయి. పాక్​కు చైనా ఆర్థికంగా సాయం అందిస్తోంది. అందుకే ఎప్పుడూ చైనాకు అనుకూలంగా ఉంటారు ఇమ్రాన్. ఇప్పుడు భారత్​-చైనా సరిహద్దు వివాదంలోనూ ఆ దేశాన్నే వెనకేసుకొస్తున్నారు.

కశ్మీర్​లో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి భారత్​పై మరింత విషం చిమ్ముతోంది పాక్​.

ABOUT THE AUTHOR

...view details