తెలంగాణ

telangana

కర్తార్​పుర్​ పాస్​పోర్ట్​పై పాక్​ విదేశాంగ శాఖ స్పష్టత

By

Published : Nov 8, 2019, 10:51 AM IST

కర్తార్​పుర్​లోని దర్బార్​ సాహిబ్​ పుణ్యక్షేత్రానికి వెళ్లే భారత యాత్రికులకు పాస్​పోర్ట్​ అవసరం లేదని పాకిస్థాన్​ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పాస్​పోర్ట్​ నిబంధనను ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ఏడాది పాటు సడలించినట్లు తెలిపింది. నవంబర్​ 9, 12 తేదీల్లో ప్రవేశ రుసుం కూడా తొలగించినట్లు పేర్కొంది. అయితే.. ఇరుదేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం నడుచుకుంటామని పేర్కొంది భారత్​.

కర్తార్​పుర్​ పాస్​పోర్ట్​పై పాక్​ విదేశాంగ శాఖ స్పష్టత

కర్తార్​పుర్​ నడవా ప్రారంభోత్సవానికి ఇంకా ఒకే రోజు ఉంది. దర్బార్​ సాహిబ్​ పుణ్యక్షేత్రాన్ని సందర్శించే యాత్రికులకు పాస్​పోర్ట్​ అవసరమా? లేదా? అనే విషయంపై గందరగోళం నెలకొన్న తరుణంలో స్పష్టత ఇచ్చింది పాకిస్థాన్​ విదేశాంగ కార్యాలయం. భారత సిక్కు యాత్రికులకు పాస్​పోర్ట్​​ అవసరం లేదని పేర్కొంది. పాస్​పోర్ట్​ నిబంధనను ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​ ఒక సంవత్సరం పాటు సడలించారని తెలిపింది.

అంతకుముందు భారత సిక్కు యాత్రికులు తప్పనిసరిగా పాస్​పోర్ట్​ కలిగి ఉండాలని పాక్​​ ఆర్మీ ప్రతినిధి మేజర్​ జనరల్​ అసిఫ్​ ఘఫూర్​ వెల్లడించారు. ఆయన ప్రకటనతో పాస్​పోర్ట్​​ అంశంపై గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో.. గురునానక్​ 550వ జన్మదినాన్ని పురస్కరించుకొని భారత సిక్కు యాత్రికులకు పలు నిబంధనలు సడలిస్తున్నట్లు పాక్​ విదేశాంగ శాఖ ప్రతినిధి మహమ్మద్​ ఫైజల్​ తెలిపారు.

" 10 రోజుల ముందుగానే యాత్రికుల వివరాలను పాక్​ ప్రభుత్వానికి అందించే నిబంధనతో పాటు నవంబర్​ 9, 12 తేదీల్లో ప్రవేశం రుసుం 20 డాలర్లను చెల్లింపును తొలగిస్తున్నట్లు ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ప్రకటించారు. ఈ విషయాన్ని తాము అధికారికంగా భారత్​కు తెలిపాం. శనివారం రోజున కర్తార్​పుర్​ కారిడార్​ ప్రారంభోత్సవానికి భారత్​తో పాటు ప్రపంచ దేశాల నుంచి సుమారు 10 వేల మంది సిక్కు యాత్రికులు హాజరవుతారని అంచనా. ఒప్పందం ప్రకారం ప్రతిరోజు భారత్​ నుంచి 5వేల మంది యాత్రికులు వస్తారు. ఇతర దేశాలకు కూడా ఇదే సంఖ్యలో వీసాలు జారీ చేయనున్నాం."

-మహమ్మద్​ ఫైజల్​, పాక్​ విదేశాంగ శాఖ ప్రతినిధి.

కర్తార్​పుర్​ కారిడార్​ పూర్తయినట్లు ఈనెల 1న పాక్​ ప్రధాని ఖాన్​ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. పాస్​పోర్ట్​, 10 రోజుల ముందు భారత సిక్కు యాత్రికులు వివరాలు తెలియజేయాలన్న నిబంధనలను సడలిస్తున్నట్లు ప్రకటించారు. పాస్​పోర్ట్​ అవసరం లేదని.. చలామణిలో ఉన్న గుర్తింపు కార్డు సరిపోతుందన్నారు.

ఒప్పందం ప్రకారమే..

పాస్​పోర్ట్​పై పాకిస్థాన్​ మిశ్రమ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ స్పందించింది. ప్రస్తుతానికి ద్వైపాక్షిక ఒప్పందం ఉందని.. ఈ ఒప్పందానికి భారత్​ కట్టుబడి ఉంటుందని పేర్కొంది. ఇది అవసరమైన పత్రాలను తెలుపుతోందని... ఒప్పందం ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: కర్తార్​పుర్ పాస్​పోర్ట్​పై స్పష్టత ఇవ్వని పాక్​

ABOUT THE AUTHOR

...view details