తెలంగాణ

telangana

ETV Bharat / international

నేపాల్​ పాఠశాలల కోసం భారత్​ భారీ సాయం!

భూకంపం దాటికి ధ్వంసమైన పాఠశాలల పునర్నిర్మాణానికి నేపాల్​కు భారత్​ భారీ సాయం ప్రకటించింది. 8 జిల్లాల్లోని 71 విద్యాసంస్థలను నిర్మించేందుకు 50 మిలియన్​ అమెరికా డాలర్లు అందించనుంది. ఇప్పటికే ఈ నిర్మాణం ప్రారంభమైనట్లు ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.

By

Published : Apr 3, 2021, 5:22 AM IST

India, Nepal
నేపాల్​, భారత్​

నేపాల్​లోని విద్యాసంస్థల పునర్నిర్మాణం కోసం భారీ సాయం ప్రకటించింది భారత్​. 2015లో భూకంపం దాటికి ధ్వంసమైన 8 జిల్లాల్లోని 71 విద్యాసంస్థలను పునర్నిర్మించేందుకు 50 మిలియన్​ అమెరికా డాలర్లు (సుమారు 5800 మిలియన్ల నేపాల్​ రూపాయలు) అందించనుంది. ఇప్పటికే 70 పాఠశాలల నిర్మాణం ప్రారంభమైంది. అందులో ఎనిమిదింటిని పాఠశాల నిర్వహణ కమిటీకి అప్పగించినట్లు నేపాల్​లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

రోషి రూరల్​ మున్సిపాలిటి పరిధిలోని హరిసిద్ధి ఉన్నత పాఠశాల, మహాభారత్​ రూరల్​ మున్సిపాలిటిలోని సిద్ధేశ్వర్​ ఉన్నత పాఠశాలల పునర్నిర్మాణ కార్యక్రమం జరిగింది. హరిసిద్ధి పాఠశాల పునర్నిర్మాణానికి 28.4 మిలియన్ల నేపాల్​ రూపాయాలు, సిద్ధేశ్వర్​ పాఠశాలకు 39.6 మిలియన్ల నేపాల్​ రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

2015, ఏప్రిల్​లో భూకంపం సభవించింది. ఈ మహా విలయంలో 9వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 8 లక్షల ఇళ్లు, పాఠశాలలు ధ్వంసమయ్యాయి. గోర్ఖా, నువాకోట్​ జిల్లాల్లో ఓనర్​ డ్రైవెన్​ మోడల్​లో భాగంగా 50 వేల ఇళ్ల నిర్మాణ లక్ష్యంలో 47 వేల ఇళ్లు పూర్తి చేశారు.

ఇదీ చూడండి:నేపాల్​ ఆర్మీకి లక్ష టీకాలు అందించిన భారత్​

ABOUT THE AUTHOR

...view details