నేపాల్లోని భారత రాయబార కార్యాలయం మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించనుంది. రెండు దేశాలలోని ఆధ్యాత్మిక, సంస్కృతిక పట్టణాలు అయిన కాఠ్మాండూ, వారణాశిల మధ్య ఈ ర్యాలీ జరగనుంది. 'పశుపతినాథ్- కాశీ విశ్వనాథ్ అమృత్ మహోత్సవ్' పేరుతో దీనిని నిర్వహించనున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్తో సహకారంతో ఈ నెల 11 నుంచి 16 వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ఈ ర్యాలీలో సుమారు 50 మంది భారతీయ, నేపాల్ పౌరులు పాల్గొననున్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య అనుబంధాన్ని ప్రోత్సహించడం సహా రెండు దేశాల యువకుల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు రాయబార కార్యాలయం పేర్కొంది.