తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత్​తో ఎందుకలా వ్యవహరిస్తోందో చైనానే చెప్పాలి'

భారత్​తో ద్వైపాక్షిక సంబంధాలను(india china relations) ఏ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటుందో చైనానే సమాధానం చెప్పాలని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. ఆ దేశం ఒప్పందాలను పదే పదే ఉల్లంఘించడం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు(india china news) క్షీణిస్తున్నాయని పేర్కొన్నారు.

By

Published : Nov 19, 2021, 3:42 PM IST

Updated : Nov 19, 2021, 4:28 PM IST

Jaishankar
జైశంకర్​

భారత్​-చైనా మధ్య సంబంధాలు(india china relations) మరింత ఆందోళనకర స్థితికి చేరుకుంటున్నాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను చైనా పదే పదే ఉల్లంఘిస్తోందని, అందుకు విశ్వసనీయ వివరణ కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. భారత్​తో ద్వైపాక్షిక సంబంధాలను ఏ స్థాయికి తీసుకుకెళ్తారనే విషయంపై చైనా నాయకత్వమే సమాధానం చెప్పాలని జైశంకర్ స్పష్టం చేశారు(india china news). సింగపూర్​లో బ్లూమ్​బర్గ్ న్యూ ఎకానమిక్ ఫోరమ్​లో 'గ్రేటర్ పవర్ కాంపిటీషన్​: ద ఎమర్జింగ్ వరల్డ్ ఆర్డర్' ప్యానెల్​ను అడిగిన ప్రశ్నలకు బదులుగా ఆయన సమాధానం చెప్పారు.

'ద్వైపాక్షిక సంబంధాల్లో ఇరు దేశాలు ఏ స్థితిలో ఉన్నాయనే విషయంపై చైనాకు ఎలాంటి సందేహాలు లేవని నేను భావిస్తున్నా. ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యితో చాలాసార్లు భేటీ అయ్యా. నేను చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా, సహేతుకంగా చెప్పా. అస్పష్టత లేదు కాబట్టి నేను చెప్పిన విషయాన్ని వారు సరిగ్గానే విని ఉంటారు' అని జైశంకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవన్నారు.

ప్రపంచంలో తిరుగులేని శక్తిగా చైనా ఎదిగిందని, అమెరికా స్థానాన్ని భర్తీ చేసే స్థాయికి చేరుకుందని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ 'అది చాలా హాస్యాస్పదం' అన్నారు జైశంకర్. చైనా విస్తరిస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ, దాని స్వభావం, ప్రభావితం చేసే తీరు చాలా భిన్నమని పేర్కొన్నారు. అమెరికా అత్యంత అనువైన భాగస్వామ్య దేశమని, గతంలో కంటే ఆలోచనలు, సలహాలు, పని ఏర్పాట్లలో చాలా స్వేచ్ఛగా ఉందని వివరించారు.

గతేడాది మే 5న పాంగాంగ్​ సరస్సు ప్రాంతంలో భారత్​, చైనా సైనికుల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి(india china border tensions). ఆ తర్వాత ఇరు దేశాలు సరిహద్దులో వేల సంఖ్యలో బలగాలను మోహరించాయి. జూన్ 15న గల్వాన్​ లోయలో జరిగిన ఘర్షణలో పదుల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఉద్రిక్తతలను తారస్థాయికి చేర్చింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా క్షీణించాయి. ఆ తర్వాత పరిస్థితులు పూర్వ స్థితికి తీసుకొచ్చేందుకు తూర్పు లద్ధాఖ్​లో కీలక ఫ్రిక్షన్​ పాయింట్ల నుంచి ఇరు దేశాలు బలగాల ఉపసంహరణ ప్రారంభించాయి. ఇప్పటివరకు 13 సార్లు సైనిక చర్చలు జరిపాయి(india china military talks). కానీ పూర్తి స్థాయిలో బలగాలను వెనక్కి తీసుకోలేదు.

ఈ నేపథ్యంలోనే తూర్పు లద్ధాఖ్​లోని బలగాల ఉపసంహరణ పూర్తి స్థాయిలో చేపట్టేందుకు త్వరలో 14వ విడత సైనిక చర్చలు జరపాలని భారత్​, చైనా గురువారం నిర్ణయించాయి.

ఇదీ చదవండి:భారత్‌పై అమెరికా కాట్సా అస్త్రం..!

Last Updated : Nov 19, 2021, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details