తెలంగాణ

telangana

By

Published : Mar 13, 2019, 10:55 AM IST

Updated : Mar 13, 2019, 3:53 PM IST

ETV Bharat / international

'బోయింగ్‌'పై భారత్​ నిషేధం

'బోయింగ్​ 737 మాక్స్​ 8' విమానాలను తాజాగా భారత్ కూడా నిషేధించింది. ఈ శ్రేణి విమానంలో భద్రతా ప్రమాణాల లోపం వల్ల ఇటీవల ఇథియోపియా విమాన ప్రమాదంలో 157 మంది మరణించారు. ఈ విమానాల నిషేధానికి ప్రపంచదేశాలు సిద్ధమవుతున్నాయి.

బోయింగ్​ 737 మాక్స్​ 8'పై భారత్​ నిషేధం

బోయింగ్​ 737 మాక్స్​ 8'పై భారత్​ నిషేధం

ఇథియోపియా విమాన ప్రమాదం తర్వాత 'బోయింగ్​ 737 మాక్స్​ 8' విమానాలను నిషేధించిన దేశాల జాబితాలో తాజాగా భారత్​ చేరింది. తక్షణమే వీటిని విమానాశ్రయాలకు పరిమితం చేయాలని పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) నిర్ణయించింది.

ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది డీజీసీఏ. భద్రతాపరంగా అన్ని అంశాలు పరిశీలించే వరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొంది.

భారత్​లో స్పైస్​జెట్ 12 ​, జెట్​ ఎయిర్​వేస్ 5 బోయింగ్​ 737 మాక్స్​ 8 విమానాలను కలిగి ఉన్నాయి. ప్రస్తుత నిర్ణయంతో ఇవి తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఎదుర్కోక తప్పదు.

నిషేధించిన దేశాలు..

ఇప్పటికే సింగపూర్​, చైనా, మలేసియా, ఇథియోపియా, ఆస్ట్రేలియాలు ఈ శ్రేణికి చెందిన విమానాలను తాత్కాలికంగా విమానాశ్రయాలకు పరిమితం చేశాయి. మరో వైపు తమ గగనతలంలో బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాలు ఎగరడానికి వీల్లేదని ఐరోపా సమాఖ్య తెలిపింది.

బోయింగ్​ 737 మాక్స్ 8 విమానాలను నిషేధించిన జాబితాలో భారత్​తో పాటు యూఏఈ, ఒమన్​, న్యూజిలాండ్​, ఫ్రాన్స్​ చేరాయి. మరిన్ని దేశాలు ఈ బోయింగ్​ విమానాలను నిషేధించడానికి సమాయత్తమవుతున్నాయి.

ఇంతకీ ఏం జరిగింది?

ఆదివారం ఇథియోపియా ఎయిర్​లైన్స్​కు చెందిన బోయింగ్ 737 మాక్స్ 8 విమానం అడీస్​ అబాబా వద్ద కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బందితో సహా మొత్తం 157 మంది మరణించారు. గతంలో ఇండోనేసియాలోనూ ఇదే శ్రేణి విమానం కూలి 180 మంది మరణించారు.

బోయింగ్​ 737 మాక్స్ 8 విమానాల్లోని భద్రతా ప్రమాణాల లోపాలే ఇందుకు కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఫలితంగా, వీటిపై ప్రపంచ దేశాలు నిషేధం విధిస్తున్నాయి.


Last Updated : Mar 13, 2019, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details