తెలంగాణ

telangana

ETV Bharat / international

ఈనెల 24న భారత్​-చైనా కమాండర్ల 9వ దఫా భేటీ - 9th round mililtary corp commander meeting

తూర్పు లద్దాఖ్​లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా మరోసారి భారత్​-చైనా ప్రతినిధులు భేటీ కానున్నారు. ఆదివారం( ఈనెల 24న) ఇరు దేశాల మధ్య 9వ దఫా కమాండర్ల స్థాయి చర్చలు జరగనున్నాయి.

India and China
ఈ ఆదివారం భారత్​-చైనా కమాండర్ల 9వ దఫా భేటీ

By

Published : Jan 23, 2021, 12:29 PM IST

భారత్​, చైనాల మధ్య 9వ విడత కార్ప్​ కమాండర్​ స్థాయి చర్చలు.. ఆదివారం(ఈనెల 24న) జరగనున్నాయి. తూర్పు లద్దాఖ్​లో నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించే దిశగా ఈ సమావేశాలు జరగనున్నాయి. భారత్​లోని చుషుల్​ మోల్దో సెక్టార్​ వద్ద ఈ భేటీ జరగనుందని సమాచారం.

తూర్పు లద్దాఖ్​ ప్రాంతంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు చైనా అంగీకరిస్తే తప్ప.. భారత్​ తన బలగాలను ఉపసంహరించుకోదని రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ శుక్రవారం స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details