కరోనా వైరస్ పేరుతో ప్రజల పట్ల చైనా అత్యంత అమానవీయంగా ప్రవర్తిస్తోంది. ముఖ్యంగా వాయవ్య ప్రాంతమైన షిన్జియాంగ్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రజలను భౌతికంగా ఇళ్లల్లో లాక్డౌన్ చేయడం, కఠిన క్వారంటైన్ నిబంధనలను అమలు చేయడం సహా.. నిర్బంధంలో ఉన్న వారిపై ఎసిడిక్ క్రిమి సంహారకాలను చల్లుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని వెంటనే అరెస్టు చేస్తున్నారు.
సాధారణంగా 14-17రోజుల పాటు క్వారంటైన్ నిబంధనలు కొనసాగిస్తున్నాయి ప్రపంచ దేశాలు. అయితే షిన్జియాంగ్లో మాత్రం అది 40రోజుల కన్నా ఎక్కువ. దీనితో పాటు... సంప్రదాయ చైనా మందులను బలవంతంగా అక్కడి ప్రజలకు ఇస్తున్నారు. ఎలాంటి క్లినికల్ డేటా లేకుండా.. మందును బెదిరించి ప్రజలకు ఇవ్వడం.. వైద్య నీతికి విరుద్ధమని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ నోటీసులు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, షిన్జియాంగ్లో క్వారంటైన్లో ఉన్న ముగ్గురితో జరిపిన ఇంటర్వ్యూ ద్వారా ఈ విషయాలు బయటపడ్డాయి.
కరోనా వైరస్ ఉద్ధృతి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు తనను నిర్బంధించినట్టు ఓ వీగర్ జాతి మహిళ తెలిపింది. తన చేత బలవంతంగా ఓ మందును తాగించారని పేర్కొంది. ఆ తర్వాత తన శరీరం నీరసించిపోయిందని, వికారం పెరిగిందని వివరించింది. నిర్బంధ గదిలో ఉన్న తనను వారానికి ఓసారి గార్డులు నగ్నంగా నిల్చోబెట్టి, క్రిమిసంహారకాలను చల్లతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీని వల్ల చర్మం ఊడివచ్చేస్తోందని చెప్పింది.
ఇక్కడే ఎందుకు?