తెలంగాణ

telangana

By

Published : Feb 20, 2021, 4:42 PM IST

Updated : Feb 20, 2021, 4:55 PM IST

ETV Bharat / international

భారత్​ లక్ష్యంగా ఇమ్రాన్..​ శ్రీలంక పర్యటన

శ్రీలంకతో సాన్నిహిత్యాన్ని ప్రదర్శిస్తున్న పాకిస్థాన్.. భారత్​కు వ్యతిరేకంగా​ సరికొత్త అడుగులు వేస్తోంది. శ్రీలంకలో ఫిబ్రవరి 22 నుంచి రెండు రోజులపాటు పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ పర్యటించనున్నారని న్యూస్​ డాట్​ ఐకే వెల్లడించింది. భారత్​కు వ్యతిరేకంగానే ఈ పర్యటనను పాక్​ ఉపయోగించుకోనుందని సమాచారం.

'Imran's Sri Lanka visit aims at gaining brownie points to be used against India'
భారత్​ లక్ష్యంగా ఇమ్రాన్..​ శ్రీలంక పర్యటన

శ్రీలంకతో సన్నిహిత సంబంధాలున్నాయని పాకిస్థాన్​ తరచుగా చెప్పుకుంటోంది. ముఖ్యంగా శ్రీలంకలో పౌరయుద్ధం తర్వాత దీనిని మనం ఎక్కువగా చూడవచ్చు. అయితే ఆ దేశంలో ఫిబ్రవరి 22 నుంచి రెండురోజులపాటు పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ పర్యటించనున్నారు. భారత్​కు చేటుచేసే ఉద్దేశంతోనే శ్రీలంక పర్యటన ఉండనుందని న్యూస్​ డాట్​ ఐకే వెల్లడించింది.

జెనీవాలో జరగనున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం 46వ సమావేశంలో శ్రీలంకపై సరికొత్త తీర్మానాలు చేసే అవకాశం ఉంది. ఈ సమావేశాల సమయంలోనే ఇమ్రాన్​ పర్యటన ఉండటం గమనార్హం. అయితే ఐక్యరాజ్యసమితిలో శ్రీలంకకు పాకిస్థాన్​ మద్దతు తెలపనుంది. ఇందుకు ప్రతిగా భారత్​కు వ్యతిరేకంగా శ్రీలంక నుంచి లాభం పొందనుందని సమాచారం. ప్రత్యేకంగా జమ్ముకశ్మీర్ విషయంలో శ్రీలంక సహాయం కోరనుందని అంచనా. అయితే ఐక్యరాజ్య సమితిలో మద్దతు కోసం భారత్​ను సైతం శ్రీలంకఅభ్యర్థించింది.

పాకిస్థాన్​ ఆర్థిక స్థితిగతులపై ఆ దేశంలో ప్రతిపక్షాల నుంచి ఇమ్రాన్​ ఖాన్​పై వ్యతిరేకత మొదలైంది. ప్రతిపక్షాలను దారిమళ్లించడానికి కూడా శ్రీలంక పర్యటన ఖాన్​కు సహాయపడనుంది. కానీ ఈ పర్యటనతో శ్రీలంక పొందే లాభం ఏమి ఉండకపోవచ్చని మేధావుల అంచనా. పాక్​ తన స్వలాభం కోసం మాత్రమే ఈ పర్యటనను వాడుకోనుందని సమాచారం.

ఇదీ చదవండి:అఫ్గాన్​లో వరుస పేలుళ్లు- ఐదుగురు మృతి

Last Updated : Feb 20, 2021, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details