తెలంగాణ

telangana

By

Published : Sep 19, 2019, 6:27 AM IST

Updated : Oct 1, 2019, 3:54 AM IST

ETV Bharat / international

'కశ్మీర్​లో పవిత్ర యుద్ధానికి పాకిస్థానీలు వెళ్లొద్దు'

అమెరికాలో వచ్చే వారం జరగబోయే ఐరాస సాధారణ సభలో కశ్మీర్​ అంశాన్ని మునుపెన్నడూ లేని విధంగా బలంగా వినిపిస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ అన్నారు. అదే సమయంలో కశ్మీర్​లో (జీహాద్​) పవిత్రయుద్ధం చేయడానికి పాకిస్థానీలు ఎవరూ వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. ఇలా చేస్తే అది కశ్మీరీలకే నష్టం చేకూరుస్తుందని పేర్కొన్నారు.

'కశ్మీర్​లో పవిత్ర యుద్ధానికి పాకిస్థానీలు వెళ్లొద్దు'

'కశ్మీర్​లో పవిత్ర యుద్ధానికి పాకిస్థానీలు వెళ్లొద్దు'

కశ్మీర్​లో పవిత్ర యుద్ధం (జీహాద్​) చేయడానికి పాకిస్థానీలెవరూ వెళ్లవద్దని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ కోరారు. ఇలా చేస్తే కశ్మీర్​ విషయంలో పాక్​ చేస్తున్న పోరాటానికి తీవ్ర విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. పాక్​-అఫ్గాన్ సరిహద్దులో నిర్మించిన తోర్ఖం టెర్మినల్​ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్​.

"పాకిస్థాన్​ నుంచి పవిత్ర యుద్ధం (జీహాద్​) చేయడానికి ఎవరైనా భారతదేశానికి వెళితే.. కశ్మీరీలకు అన్యాయం చేసిన మొదటి వ్యక్తి మీరే అవుతారు. కశ్మీరీలకు శత్రువులవుతారు."​- ఇమ్రాన్​ఖాన్​, పాకిస్థాన్​ ప్రధాన మంత్రి

కశ్మీరీలను అణచివేసేందుకు భారత్​ ఓ కారణం వెదుకుతోందని ఇమ్రాన్ అన్నారు. కశ్మీర్​ నుంచి అందరి దృష్టిని మళ్లించేందుకు భారత్​ ఓ తప్పుడు ఆపరేషన్​ ప్రారంభించవచ్చని ఆయన పదేపదే చెబుతున్నారు.

ట్రంప్​తో సమాలోచనలు..

వచ్చే వారం కశ్మీర్​ సమస్యను ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రస్తావించడానికి ఇమ్రాన్​ సిద్ధమవుతున్నారు. పనిలోపనిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తోనూ ఈ విషయమై చర్చించాలని నిర్ణయించారు.

"ఐరాస సాధారణ సభలో మునుపెన్నడూ లేని విధంగా కశ్మీర్​ సమస్యను బలంగా వినిపిస్తాం."- ఇమ్రాన్​ఖాన్, పాక్ ప్రధాని

చర్చల్లేవ్​...

ఆర్టికల్​ 370 పునరుద్ధరణతో పాటు కశ్మీర్​లో ఆంక్షలు ఎత్తివేసేంత వరకు భారత్​లో పాక్ శాంతిచర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇమ్రాన్ ప్రకటించారు. కొందరు రాజకీయ, మతాధికార పార్టీలతో కలిసి నియంత్రణరేఖ వెంబడి మార్చ్​ చేయాలని ఇమ్రాన్​ తొలుత భావించారు. అయితే ఐరాసలో సెప్టెంబర్​ 27న కశ్మీర్​ అంశాన్ని చర్చించేవరకు ఈ కవాతు​ వాయిదా వేయాలని నిర్ణయించారు.

ఆర్టికల్ 370 రద్దుతో

భారత్​ కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీనిపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ వేదికలను ఆశ్రయిస్తోంది. అయితే కశ్మీర్.. తమ అంతర్గత విషయమని భారత్ తేల్చిచెప్పింది. దీనితో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి: ప్రధాని మోదీ విమానానికి అనుమతినివ్వని పాక్​

Last Updated : Oct 1, 2019, 3:54 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details