తెలంగాణ

telangana

By

Published : May 8, 2020, 2:39 PM IST

Updated : May 8, 2020, 4:00 PM IST

ETV Bharat / international

వేడి, తేమ వాతావరణంలోనూ కరోనా పంజా!

వేడి, తేమతో కూడిన వాతావరణంలోనూ కరోనా వ్యాప్తి తగ్గదని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. పాఠశాలల మూసివేత, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్​ ప్రభావాన్ని నియంత్రించినట్లు స్పష్టమైంది.

Hotter, humid weather may not halt spread of COVID-19
వేడి, తేమ వాతావరణంలోనూ కరోనా పంజా

కరోనా మహమ్మారికి వాతావరణ పరిస్థితులతో సంబంధం లేదని పరిశోధకులు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, తేమతో కూడిన వాతావరణంలో వైరస్​ వ్యాప్తిలో పెద్దగా మార్పు లేదని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, రాష్ట్రాల్లోని 144 భౌగోళిక ప్రాంతాల్లో పరిశోధనలు జరిపారు. ఈ అధ్యయనాన్ని కెనడా మెడికల్​ అసోసియేషన్​ జర్నల్​లో ప్రచురించారు.

పాఠశాలల మూసివేత, భౌతిక దూరం పాటించడం వంటి ఆంక్షల ద్వారా పలు దేశాలు వైరస్​ వ్యాపిని నియంత్రించినట్లు అధ్యయనం పేర్కొంది. ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా సహా అనేక దేశాల నుంచి వివరాలు సేకరించారు పరిశోధకులు. మార్చి 20నాటికి నమోదైన కేసులను.. మార్చి 27వరకు నమోదైన కేసుల సంఖ్యతో పోల్చి చూశారు.

మొదట నిర్వహించిన ప్రాథమిక పరిశోధనలో వేడి వాతావరణంలో వైరస్​ వాప్తి తగ్గుతుందని తెలిసిందనీ, కానీ తర్వాత చేసిన పరిశోధనలోని ఫలితాలు తమ అంచనాలను తలకిందులు చేసినట్లు అధ్యయనంలో పాల్గొన్న పీటర్​ జుని తెలిపారు. ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తే వైరస్​ వ్యాప్తిని నియంత్రిచవచ్చని స్పష్టం చేశారు. పలు దేశాలు ఇప్పుడిప్పుడే ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో ఈ అధ్యయనం ద్వారా వెల్లడైన విషయాలు ఆలోచింపజేస్తున్నాయి.

కరోనా ప్రభావం తగ్గిన చైనా, ఇటలీ, ఇరాన్​, దక్షిణ కొరియా దేశాల నుంచి ఎలాంటి వివరాలు సేకరించలేదు పరిశోధకులు.

Last Updated : May 8, 2020, 4:00 PM IST

ABOUT THE AUTHOR

...view details