తెలంగాణ

telangana

ETV Bharat / international

హాం​కాంగ్​ నిరసనలు హింసాత్మకం.. 24 మందికి గాయాలు - హాం​కాంగ్​ నిరసనలు హింసాత్మకం.. 24 మందికి గాయాలు

హాంకాంగ్​లో మరోమారు నిరసనలు హోరెత్తాయి. ఫలితంగా ఆందోళనకారులు, పోలీసులకు మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 24 మంది గాయపడగా.. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

హాం​కాంగ్​ నిరసనలు హింసాత్మకం.. 24 మందికి గాయాలు

By

Published : Oct 21, 2019, 5:46 AM IST

Updated : Oct 21, 2019, 7:59 AM IST

హాంకాంగ్​లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు చైనాతో పాటు హాంకాంగ్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తూ.. రహదారులను నిర్భంధించారు. కొన్ని ప్రాంతాల్లో వాణిజ్య భవనాలకు నిప్పు అంటించారు. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించారు. ఫలితంగా నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలో 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.

హాం​కాంగ్​లో నిరసనలు

చైనా ప్రోద్బలంతో స్థానిక ప్రభుత్వం అత్యవసర అధికారాలు ఉపయోగించి నిరసనకారులు మాస్క్​లు ధరించడంపై నిషేధం విధించింది. అయినప్పటికీ ప్రజాస్వామ్యవాదులు పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఆందోళనలను తీవ్రం చేశారు.

ఇదీ చూడండి:నేడు భారత్​-అమెరికా ప్రతినిధుల ఉన్నతస్థాయి సమావేశం

Last Updated : Oct 21, 2019, 7:59 AM IST

ABOUT THE AUTHOR

...view details