తెలంగాణ

telangana

By

Published : Jun 6, 2019, 6:21 AM IST

Updated : Jun 6, 2019, 7:19 AM IST

ETV Bharat / international

ఈద్​ ప్రార్థనల సారథిగా సయీద్​ వద్దు: పాక్​

పవిత్ర ఈద్ ప్రార్థనలకు సారథ్యం వహించేందుకు ఉగ్రవాద సంస్థ జేయూడీ అధినేత హఫీజ్​ సయీద్​కు పాకిస్థాన్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్​కు గత కొన్నేళ్లలో ఎప్పడూ అనుమతి నిరాకరించలేదు.

సారథిగా సయీద్​ వద్దు

ముంబయి దాడుల సూత్రధారి, ఉగ్రవాద సంస్థ జమాత్​-ఉద్-దావా (జేయూడీ) అధినేత హఫీజ్ సయీద్​కు పవిత్ర 'ఈద్​ ఉల్ ఫితర్' సందర్భంగా పాకిస్థాన్​ ప్రభుత్వం షాకిచ్చింది. పాకిస్థాన్​ పంజాబ్​లోని ఖడాఫీ మైదానంలో జరిగిన పవిత్ర ఈద్ ప్రార్థనలకు సారథిగా ఉండేందుకు ఆయనకు అనుమతి నిరాకరించింది.

ఇందుకు బదులుగా స్థానిక మసీదుల్లో నిర్వహించే ప్రార్థనలకు సారథిగా వ్యవహరించేందుకు సయీద్​కు అనుమతినిచ్చినట్లు పాక్ అధికార ప్రతినిధి తెలిపారు.

"జేయూడీ ఉగ్రసంస్థ అధినేత మొదట ఖడాఫీ మైదానంలో ఈద్ ప్రార్థనలు చేయించాలని భావించాడు. అయితే ఈద్​కు ఒక రోజు ముందు అతను ప్రార్థనలకు సారథిగా వ్యవహరించకూడదని ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. ఒక వేళ సయీద్ ముందుగా అనుకున్నట్లుగానే ప్రార్థనలకు సారథిగా ఉంటే.. ప్రభుత్వం అతణ్ని అరెస్టు చేసి ఉండేది." - పాక్ అధికారి

ప్రభుత్వ ఆదేశాలను పాటించడం తప్ప సయీద్​కు వేరే ప్రత్యామ్నాయం లేదు. ఖడాఫీ మైదానంలో ప్రార్థనలు ఆపేందుకు కూడా అవకాశం లేదని అధికారి తెలిపారు.

కొన్నేళ్లుగా ఖడాఫీ మైదానంలో జరిగే ఈద్ ఉల్ ఫితర్, ఈద్​ ఉల్ అజా ప్రార్థనలకుసారథిగాసయీద్​ వ్యవహరిస్తున్నాడు. ఈ ప్రార్థనలకు ప్రభుత్వం కూడా గట్టి భద్రతను కల్పించేది. అయితే గతంలో ప్రార్థనలకు సారథ్యం వహించడమే కాకుండా.. అక్కడికి వచ్చిన వేలాదిమంది ప్రజల ముందు కశ్మీర్​పై తన కార్యచరణను చెప్పేవాడు సయీద్.

సయీద్​ను నిషేదించిన ఐరాస

ముంబయి ఉగ్రదాడులకు సుత్రధారిగా వ్యవహరించి.. 166 మంది మరణానికి కారణమైన సయీద్​పై ఐక్యరాజ్య సమితి 2008 డిసెంబర్​ 10న నిషేధం విధించింది.

ఇదీ చూడండి:'ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో పత్రికా స్వేచ్ఛ'

Last Updated : Jun 6, 2019, 7:19 AM IST

ABOUT THE AUTHOR

...view details