తెలంగాణ

telangana

ETV Bharat / international

హఫీజ్​ సయీద్​పై నేరారోపణకు కాస్త ఆలస్యం..! - Ministry of External Affairs Spokesperson Raveesh Kumar

జమాత్ ఉద్ దవా(జేయూడీ)నేత, ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్​ సయీద్​కు కాస్త ఊరట కలిగింది. అధికారులు సరైన సాక్ష్యాలు సమర్పించని కారణంగా.. హఫీజ్​పై లాహోర్​లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు అభియోగాలు మోపలేదు. తదుపరి విచారణ డిసెంబర్​ 11కు వాయిదా వేసింది.

hafiz-saeed-gets-brief-breather-in-terror-financing-trial-next-hearing-on-dec-11-by-m-zulqernain
హఫీజ్​ సయీద్​పై నేరారోపణకు కాస్త ఆలస్యం..!

By

Published : Dec 7, 2019, 6:19 PM IST

కరుడుగట్టిన ఉగ్రవాది, ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్​ సయీద్​పై నేరారోపణకు మరికొంత సమయం పట్టనుంది. శనివారం విచారణ సందర్భంగా అధికారులు.. సహ నిందితుల్ని ప్రవేశపెట్టని కారణంగా తదుపరి విచారణను డిసెంబర్​ 11కు వాయిదా వేసింది లాహోర్​ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, ఇతర సహ నిందితులు మాలిక్​ జఫార్​ ఇక్బాల్​లను డిసెంబర్​ 11న జైలు నుంచి కోర్టు ముందు ప్రవేశపెట్టాలని స్పష్టం చేసింది.

2008 నాటి ముంబయి పేలుళ్ల సూత్రధారి అయిన హఫీజ్​ను ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న అభియోగాలతో జులై 17న పాక్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం.. అతడ్ని జ్యుడీషియల్​ కస్టడీలో ఉంచారు. హఫీజ్​ కేసుకు సంబంధించిన అభియోగ పత్రాలను సమర్పించాలని పోలీసుల్ని కోర్టు ఆదేశించింది. తాజాగా.. సహ నిందితుల్ని కోర్టులో ప్రవేశపెట్టలేకపోయారు అధికారులు.

సయీద్​ నేతృత్వంలోని 'జేయూడీ' సంస్థ లష్కరే తోయిబాను ముందుండి నడిపిస్తున్నట్లు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. 2008లో ముంబయిలో ఉగ్రదాడులకు బాధ్యత వహించింది లష్కరే తోయిబా. ఆ ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:పాక్​​ జైలులో హఫీజ్​ సయీద్ సెటిల్మెంట్ దందా

నిందితులకు పాక్​ ఆతిథ్యం...

26/11 ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్​ సయీద్​.. పాకిస్థాన్​లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని భారత్​ వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఇలా జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాడి నిందితులకు పాకిస్థాన్​ ఆశ్రయం కల్పిస్తోందని భారత్​ పేర్కొంది.

ముంబయి దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులపై చర్యలు చేపట్టే విషయంలో పాకిస్థాన్‌ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని.. భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ శుక్రవారం అన్నారు. పొంతనలేని కారణాలు చెప్పి ముష్కరులు తప్పించుకు తిరుగుతున్నారన్నారు. ఇప్పటికైనా వారిపై సరైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత దాయాది దేశంపై ఉందని గుర్తుచేశారు.

ABOUT THE AUTHOR

...view details