ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను బయపెడుతోంది కరోనా వైరస్. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాస్క్లను ధరించాలని వైద్యుల సూచించారు. అందువల్ల ప్రస్తుతం చాలా మంది మస్క్లు ధరిస్తున్నారు. కొన్ని దేశాల్లో మాస్క్ల కోసం గంటలపాటు క్యూలైన్లో నిలబడి మరీ కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మాస్క్ల కొరత ఏర్పడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది.
"ప్రస్తుతం ప్రపంచం మాస్క్ల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది."
-టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్.
మొత్తం 636 మంది..
చైనాలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 636కు చేరింది. గురువారం ఒక్కరోజే 73 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 31,000 మందికి పైనే ఈ వైరస్ సోకినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు వ్యాధి నుంచి కోలుకుని 1,540 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
జపాన్ నౌకలో 41 మందికి...
జపాన్లోని యొకోహామా తీరానికి చేరిన ‘డైమండ్ ప్రిన్సెస్’ విహార నౌకలో మరో 41 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఫలితంగా నౌకలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 61కి చేరింది. నౌకలో మొత్తం 3,711 మంది ప్రయాణికులున్నారు.
ఇదీ చూడండి: నిర్భయ కేసు: తీహార్ జైలు అధికారుల పిటిషన్ కొట్టివేత