ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను స్వాధీనం చేసుకుంటామని భారత సైన్యాధిపతి ఎంఎం నరవణే చేసిన వ్యాఖ్యలపై పాక్ స్పందించింది.భారత్ ఎలాంటి చర్యలకు పాల్పడినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని పేర్కొంది.
"భారత్లో జరుగుతున్న ఆందోళనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే,నియంత్రణ రేఖ వద్ద సైనిక చర్యలు చేపడతామని భారత ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎటువంటి చర్యలు చేపట్టినా పాక్ ఎదుర్కొంటుంది."