అఫ్గానిస్థాన్ కాబుల్కు చెందిన మాజీ రిపోర్టర్ లక్ష్యంగా శనివారం ఉదయం కారు బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న రిపోర్టర్తోపాటు, మరో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు కాబుల్ పోలీసులు తెలిపారు. మరణించిన మాజీ రిపోర్టర్ను యమాసియావాష్గా గుర్తించామని వివరించారు.పేలుళ్ల వెనుక ఎవరి హస్తం ఉందో తెలియాల్సి ఉందన్నారు. శనివారం జబుల్ రాష్ట్రంలో జరిగిన మరో పేలుడు ఘటనలో ఏడుగురు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం.
గత కొన్ని నెలలుగా అఫ్గాన్లో మారణకాండ కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాబుల్ విశ్వవిద్యాలయంలో జరిగిన పేలుళ్లలో 22మంది విద్యార్థులు మరణించారు. అక్టోబరు24న ఓ క్యాంపస్లో జరిగిన దాడిలో 24మంది విద్యార్థులు ప్రాణాలొదిలారు.