అప్గానిస్థాన్(Afghan Taliban) నుంచి ప్రజలను తరలించే ప్రక్రియ పూర్తయినట్లు కెనడా ప్రకటించింది. అమెరికా కంటే ముందే ఇతర దేశాలు కాబుల్ను ఖాళీ చేయాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకన్నట్లు తెలిపింది. అఫ్గాన్ను(Afghanistan crisis) వీడాలనుకునేవారి కోసం తాము సాధ్యమైనంత సమయం కేటాయించామని పేర్కొంది. మిలిటరీ విమానాల్లో మొత్తం 3,700మందిని తమ దేశానికి తరలించినట్లు కెనడా జనరల్ వేనీ ఐరే వెల్లడించారు.
అఫ్గాన్ నుంచి బ్రిటన్కు వెళ్లే అర్హత ఉన్నవారిలో దాదాపు అందరినీ తరలించినట్లు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. కాబుల్ ఎయిర్పోర్టు నుంచి తమ వాయుసేన విమానాల ద్వారా 15వేల మందిని తరలించినట్లు వెల్లడించారు. సమయం చాలా తక్కువగా ఉందని, ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే తరలించేందుకు ప్రయత్నిస్తామన్నారు.
కాబుల్ నుంచి ప్రజలను పాకిస్థాన్కు తరలించే ప్రక్రియ పూర్తయినట్లు బెల్జియం ప్రకటించింది. వీరందరినీ త్వరలో తమ దేశం తీసుకెళ్తామని చెప్పింది. ఇప్పటి వరకు 1100 మందిని బెల్జియం తీసుకెళ్లినట్లు ఆ దేశ మంత్రి అలెగ్జాండర్ డి క్రూ తెలిపారు.