ప్రకృతిని పరిరక్షించాలనే ఉద్దేశంతో న్యూదిల్లీలో జరుగుతున్న 'లోటస్ మేకప్ ఫ్యాషన్ షో' చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పచ్చని చెట్ల మధ్య అమ్మాయిల వయ్యారి నడకలు వీక్షకులను కట్టిపడేస్తున్నాయి. ప్రముఖ డిజైనర్లు సాహిల్ కొచ్చర్, రీనాధాకా, సమంత్ చౌహన్ రూపొందించిన వస్త్రాలతో మోడళ్లు ర్యాంప్పై హోయలొలికిస్తున్నారు. నేటి నుంచి ఈ నెల 16 వరకు మరో మూడు రోజుల పాటు ఈ ఫ్యాషన్ షో అందరికీ కనువిందు చేయనుంది.
ప్రకృతి కోసం ఫ్యాషన్ సందేశం
కాలుష్యాన్ని నియంత్రించాలనే సందేశంతో దిల్లీలో నిర్వహిస్తున్న ఫ్యాషన్ షో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమం 16వ తేదీ వరకు కొనసాగుతుంది.
ఫ్యాషన్ షో
"మనం ఇప్పటికే ఈ భూమిని చాలా రకాల కాలుష్యాలతో నింపేస్తున్నాం. ప్రస్తుతం వీటిపై పోరాడాల్సిన అవసరముంది" -- సాహిల్ కొచ్చర్, డిజైనర్