టిబెట్లో ప్రవాసీ ప్రభుత్వం కోసం చివరి విడత సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. భారత్ సహా మొత్తం 26 దేశాల్లో ఉన్న టిబెటన్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ధర్మశాల కేంద్రంగా ఉన్న ప్రవాసీ పార్లమెంటుకు సంబంధించి, తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు జరిగాయి.
సెంట్రల్ టిబెటన్ అడ్మినిష్ట్రేషన్ (సీటీఏ)లో మొత్తం 45 మంది సభ్యులు ఉండగా వారిని ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు జరిగాయి. మొత్తం 26 దేశాల్లో లక్షా 30వేల మంది టిబెటన్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్లు టిబెట్ ఎన్నికల కమిషనర్ చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాలు మే 14న వెలువడనున్నాయి.