తెలంగాణ

telangana

ETV Bharat / international

'మరో కేసుతో జాదవ్​కు ముడిపెడుతున్న పాక్'

భారత నావికాదళ మాజీ అధికారి కుల భూషణ్​ జాదవ్​ కేసులో పాక్​ వ్యవహరిస్తున్న తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీ వాస్తవ. జాదవ్​పై మరో కేసు మోపేందుకు పాక్​ కుట్ర పన్నుతోందని తెలిపారు.

By

Published : Dec 4, 2020, 7:04 AM IST

ex navy officer kulbhushan jadav case pakistan
'మరో కేసుతో జాదవ్​కు ముడిపెడుతున్న పాక్'

పాకిస్థాన్​ చెరలో ఉన్న భారత నావికాదళ మాజీ అధికారి కుల​భూషణ్​ జాదవ్​ను సంబంధం లేని మరో కేసుతో ముడిపెడుతున్నారని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీ వాస్తవ గురువారం మీడియాతో మాట్లాడారు.

"మహమ్మద్ ఇస్మాయిల్​ అనే భారతీయుడు పాక్​లో జైలు శిక్ష పూర్తి చేసుకున్నా ఇంకా విడుదల కాలేదు. అతన్ని భారత్​కు అప్పగించాలన్న విషయమై వాదించేందుకు పాక్​లోని భారత హైకమిషన్​..షానజాన్​ నూన్​ను న్యాయవాదిగా నియమించింది. ఇస్లామాబాద్​ హైకోర్టులో వాదనల సందర్భంగా ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని జాదవ్ ప్రస్తావన తీసుకొచ్చారు.​ జాదవ్​ తరఫున న్యాయవాది నియామకంపై భారత్​ తన వైఖరి చెప్పాలనుకుంటోందంటూ షానవాజ్​ ప్రకటించారు. పాక్ అధికారుల ఒత్తిడి మేరకే అతనిలా మాట్లాడినట్టు తెలుస్తోంది"

--- విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీ వాస్తవ

గూఢచర్యం ఆరోపణలతో జాదవ్​కు పాక్ కోర్టు మరణశిక్ష విధించగా..అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యంతో శిక్ష నిలిపివేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి:హఫీజ్​ అధికార ప్రతినిధికి 15 ఏళ్ల జైలు శిక్ష

ABOUT THE AUTHOR

...view details