తెలంగాణ

telangana

ETV Bharat / international

పసిఫిక్​ మహాసముద్రం, నేపాల్​లో భూకంపం

ఆగ్నేయ పసిఫిక్​ మహా సముద్రంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేపాల్​లోనూ 5.8 తీవ్రతతో భూమి కంపించింది.

By

Published : May 19, 2021, 7:50 AM IST

Earthquake
భూకంపం

ఆగ్నేయ పసిఫిక్​ మహా సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 6.7 తీవ్రత నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

నేపాల్​లో..

నేపాల్​లో బుధవారం ఉదయం భూప్రకంపనలు వచ్చాయి. కాఠ్​మాండూకు 113 కి.మీటర్ల దూరంలోని లాంజుంగ్​ జిల్లాలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 5.8 తీవ్రత నమోదైందని నేపాల్​ జాతీయ భూకంప పర్యవేక్షణ పరిశోధన కేంద్రం తెలిపింది. ఉదయం 5:42 గంటలకు భూమిలో కదలికలు ఏర్పడ్డాయని చెప్పింది.

ఇప్పటివరకు ఈ భూకంపాల వల్ల ఎలాంటి నష్టం సంభవించలేదని తెలుస్తోంది.

ఇదీ చూడండి:''సింగపూర్​ స్ట్రెయిన్​తో​ ముప్పు' వ్యాఖ్యల్లో నిజం లేదు'

ABOUT THE AUTHOR

...view details