తెలంగాణ

telangana

By

Published : Oct 22, 2021, 5:14 AM IST

Updated : Oct 22, 2021, 6:12 AM IST

ETV Bharat / international

నేపాల్​లో వరద బీభత్సం .. 104 మంది బలి

నేపాల్​లో కుండపోత వర్షాలు అతలాకుతలం సృష్టిస్తున్నాయి. వరదల ధాటికి 104 మంది మృతి చెందినట్లు ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

nepal floods
నేపాల్​

నేపాల్​లో మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరద కారణంగా పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఇప్పటివరకు మొత్తం 104 మంది చనిపోగా.. 41 మంది గల్లంతయ్యారు. వీటిలో చాలా వరకు మరణాలు కొండచరియలు విరిగిపడటం వల్ల సంభవించినట్లు ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

విరిగి పడుతున్న కొండచరియలు
నేపాల్ వరద విలయం

'దేశంలోని వివిధ ప్రావిన్సుల్లో సంభవించిన వరదల వల్ల బుధవారం ఒక్కరోజే 63 మంది మరణించారని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని' హోం మంత్రిత్వ శాఖ విపత్తు నిర్వహణ విభాగం అధికారి హమ్కల పాండే తెలిపారు. మరోవైపు.. ఈ విపత్తులో కనిపించకుండాపోయిన వారి సంఖ్య 41కి చేరింది. వారి కోసం అధికారులు అన్వేషిస్తున్నారు.

నీట మునిగిన భవనాలు
రహదారులు జలమయం

ఇక.. వరదల కారణంగా 2,232 ఇళ్లు మునిగిపోగా.. 1,177 గృహాలు కొట్టుకుపోయాయి. మరో నలభై తొమ్మిది ఇళ్లు, 8 గోశాలలు, 6 వంతెనలు, 3 ప్రభుత్వ కార్యాలయాలు దెబ్బతిన్నాయి.

కొండచరియలు విరిగిపడటంతో వాహనదారుల ఇక్కట్లు

వరదలు ముప్పు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది సైన్యం.

ఇవీ చదవండి:

Last Updated : Oct 22, 2021, 6:12 AM IST

ABOUT THE AUTHOR

...view details