తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా కాటు: 636కు చేరిన మృతుల సంఖ్య - కరోనా వైరస్ మృతి 73

ప్రపంచాన్ని గడగడ వణికిస్తోన్న కరోనా వైరస్​ మరో 73 మందిని పొట్టనపెట్టుకుంది. ఇప్పటివరకు చైనాలో 636 మంది మృతి చెందారు. జపాన్ సమీపంలో నిలిచి ఉన్న పడవలో మరో 41మందికి ఈ ప్రాణాంతక వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. చైనాలోని తమ దేశస్థులను వెనక్కి తీసుకెళ్లింది కెనడా.

corona
కరోనా వైరస్

By

Published : Feb 7, 2020, 7:39 AM IST

Updated : Feb 29, 2020, 11:54 AM IST

ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిణమించిన ప్రాణాంతక కరోనా వైరస్​ ధాటికి మరో 73 మంది మృతి చెందారు. తాజా మృతులతో ఈ ప్రాణాంతక మహమ్మారి బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 636కు చేరింది. ఇప్పటివరకు 31, 161 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే 1540 మంది వ్యాధి తీవ్రత తగ్గిన వారిని డిశ్ఛార్జీ చేశారు.

జపాన్ ఓడలో మరో 41 మందికి..

జపాన్​కు సమీపంలో నిలిపేసిన ఓడలోని 41 మందికి కరోనా సోకినట్లు సమాచారం.

చైనాలోని కెనడా వాసులు స్వదేశానికి

కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో చైనాలోని తమ దేశస్థులను వెనక్కి తీసుకెళ్లింది కెనడా. 347 మంది కెనడా వాసులు చైనాలో ఉండగా తొలి దఫాలో 176 మందిని స్వదేశానికి తరలించింది. తమ వాసులకు ప్రత్యేక వైద్య శిబిరం కోసం 14 రోజుల్లో ఆసుపత్రిని నిర్మించింది కెనడా.

ఇదీ చూడండి: వారితో వేడుక చేసుకున్న ట్రంప్!

Last Updated : Feb 29, 2020, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details