ప్రపంచ దేశాలను చైనా వైరస్ గడగడలాడిస్తోంది. కరోనా వైరస్ ఇప్పటికే 17మందిని బలితీసుకుంది. బుధవారం నాటికి వైరస్ సంబంధిత లక్షణాలతో 543 కేసులు నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. అమెరికా, హాంగ్కాంగ్, మెక్సికో దేశాల్లో ఈ వ్యాధికి సంబంధించిన కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.
వణికిస్తోన్న కరోనా.. 17కు చేరిన మృతులు - Latest news for China's coronavirus
చైనాలో కరోనా వైరస్.. మృతుల సంఖ్య 17కు చేరుకుంది. 543మంది ఈ వైరస్ బారిన పడినట్లు అధికారులు పేర్కొన్నారు. విదేశాలకు ప్రయాణించవద్దని వుహాన్ వాసులకు చైనా సూచనలు చేసింది. అమెరికా, హాంగ్కాంగ్, మెక్సికో దేశాలలో న్యుమోనియా వ్యాధి లక్షణాలతో అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడం ప్రపంచ దేశాలలో గుబులు పుట్టిస్తోంది.
17కు చేరిన కరోనా వైరస్ బాధితుల సంఖ్య!
వుహాన్ నగరం ఈ వైరస్కు కేంద్ర బిందువుగా మారింది. చైనాలో నూతన సంవత్సర వేడుకలు, సెలవుల నేపథ్యంలో చైనాను విడిచివెళ్లవద్దని నగరవాసులకు సూచనలు చేసింది ప్రభుత్వం.ప్రాణాంతక వైరస్తో ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర సమావేశం జరిపింది. ఈ వైరస్ను ప్రపంచవ్యాప్త ఆరోగ్య అత్యయిక పరిస్థితిగా ప్రకటించే అంశంపై చర్చలు జరిపింది.
ఇదీ చూడండి:వణికిస్తున్న రాకాసి వైరస్- దిల్లీ ఎయిర్పోర్ట్లోనూ పరీక్షలు
Last Updated : Feb 18, 2020, 1:51 AM IST