తెలంగాణ

telangana

By

Published : Mar 3, 2020, 11:26 AM IST

ETV Bharat / international

చైనాలో 2,943కు చేరుకున్న కరోనా మృతులు

కరోనా వైరస్​తో చైనాలో సోమవారం 31 మంది మరణించారు. దీంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 2,943కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 3,056 మంది కరోనా కాటుకు బలైనట్లు ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

Coronavirus death toll climbs to 2,943 in China, infected cases witness surge globally
చైనాలో 2,943కు చేరుకున్న కరోనా మృతులు

చైనాలో కరోనా వైరస్​తో మృతి చెందేవారి సంఖ్య రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. మహమ్మారి బారినపడి సోమవారం 31 మంది మృతి చెందినట్లు ప్రకటించాయి ఆ దేశ ఆరోగ్య వర్గాలు. మొత్తం మృతుల సంఖ్య 2,943కు చేరినట్లు వెల్లడించాయి. తాజా మరణాలన్నీ వైరస్​ తీవ్రత అధికంగా ఉన్న హుబేలోనే నమోదయ్యాయి. కొత్తగా 125 మందికి వైరస్​ సోకినట్లు తెలిపారు అధికారులు. ఇందులో 114 మంది హుబేకు చెందిన వారే.

ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా 89,527 మందికి వైరస్​ సోకినట్లు ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ). మొత్తం 3,056 మంది మృత్యువాతపడినట్లు పేర్కొంది.

దక్షిణ కొరియాలో పెరుగుతున్న కేసులు

దక్షిణ కొరియాలో నూతనంగా 477 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 5 వేల మందికి చేరింది. ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. జపాన్​లో 980, ఇటలీలో 2,036, ఫ్రాన్స్​లో 191, ఇరాన్​లో 1500లకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ వరుసగా 12, 52, 66 మంది చొప్పున మరణించారు.

ఇదీ చూడండి:బ్రెజిల్​లో పడవ బోల్తా..18 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details