తెలంగాణ

telangana

By

Published : Apr 13, 2020, 8:25 PM IST

ETV Bharat / international

లాక్​డౌన్​ తర్వాత పాఠశాలల రీఓపెనింగ్ ఇలా...

దాదాపు 3 నెలల తర్వాత విద్యా సంస్థలను తిరిగి తెరుస్తోంది చైనా. కొద్దిరోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న పరిస్థితుల్లో... విద్యార్థుల సంరక్షణ కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది.

Coronavirus: China bans sports events, gatherings in schools
అత్యంత జాగ్రత్తల నడుమ తెరుచుకోనున్న పాఠశాలలు

కరోనా సంక్షోభం తర్వాత చైనాలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటీవల లాక్​డౌన్​ ఎత్తివేసిన అక్కడి ప్రభుత్వం.. అనేక జాగ్రత్తలతో పాఠశాలలను పునఃప్రారంభించాలని యోచిస్తోంది. ఈ మేరకు విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య రక్షణ కోసం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యాసంస్థల్లో సమావేశాలు, క్రీడా కార్యక్రమాలు నిషేధించింది.

అంటువ్యాధులు నివారణ, నియంత్రణ దృష్టిలో ఉంచుకొని స్థానిక అవసరాలకు అనుగుణంగా క్రీడా శిక్షణలు, వ్యాయామ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని విద్యా సంస్థలను ఆదేశించింది చైనా విద్యా శాఖ.

పాక్షికంగా తెరుచుకున్న విద్యా సంస్థలు

తూర్పు చైనాలో పాక్షికంగా విద్యా సంస్థలు తెరిచారు. 9.77 లక్షలమంది విద్యార్థులు హాజరైనట్లు సమాచారం. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలియజేసే డిజిటల్​ సంకేతాలు, శరీర ఉష్ణగ్రతలను తెలుసుకున్న తర్వాతే వారిని లోపలకు అనుమతించారు. బీజింగ్​ నగర యంత్రాంగం కూడా క్రమంగా పాఠశాలను తెరవాలనే ఆలోచనలో ఉంది.

ఇదీ చూడండి:లాక్​డౌన్​ ఎత్తివేత ఒత్తిడిలో ప్రపంచ దేశాలు

ABOUT THE AUTHOR

...view details