ప్రపంచ దేశాలపై కరోనా విలయ తాండవం ఆగడం లేదు. ఇప్పటి మొత్తం 33లక్షల 30వేల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. మృతుల సంఖ్య 2లక్షల 30వేలు దాటింది. మొత్తం 10.53లక్షల మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. అమెరికాలో కరోనా కేసులు 11లక్షలకు చేరువలో ఉన్నాయి.
రష్యాలో నెమ్మదిగా మొదలైన కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పుంజుకుంది. దేశవ్యాప్తంగా శుక్రవారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే దాదాపు 8 వేల మంది వైరస్ బారిన పడ్డారు.
ఫలితంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,14,431కి పెరిగింది. అయితే రష్యాలో నిర్ధరణ పరీక్షల రేటు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఫలితాల్లోనూ 70-80 శాతం కచ్చితత్వం నమోదవుతోందని సమాచారం. ఆ దేశంలో గణాంకాలకు మించి కేసులు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తన్నారు.
రష్యాలోని 5 ప్రాంతాల్లో న్యూమోనియా కేసులు పెరుగుతున్నట్లు వైద్య అధికారులు గుర్తించారు. మాస్కోలో చాలా వైరస్ కేసుల్లో ఇదే జరుగుతోందని చెబుతున్నారు. రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్తిన్కు కరోనా పాజిటివ్గా తేలింది.
పాక్ స్పీకర్కు కరోనా..
పొరుగు దేశం పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖైసర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా సోకినట్లు తెలియగానే ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. పాక్ నేతల్లో ఖైసర్ కన్నా ముందు సింధ్ రాష్ట్ర గవర్నర్ ఇమ్రాన్ ఇస్మాయిల్కు కరోనా సోకింది.