తెలంగాణ

telangana

By

Published : Jan 8, 2022, 3:36 PM IST

Updated : Jan 8, 2022, 6:34 PM IST

ETV Bharat / international

మంచువర్షం.. కార్లలోనే ఇరుక్కుపోయి 21 మంది మృతి

Pakistan Snow Deaths: భారీ మంచువర్షం కారణంగా వాహనాల్లో ఇరుక్కుని 21 మంది మృతిచెందారు. ఇందులో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ విషాద ఘటన పాకిస్థాన్​లో జరిగింది.

Cold kills 16 stuck in cars
చలికి కార్లలో ఇరుక్కుని 16 మంది మృతి

Pakistan Snow Deaths: హిమపాతం మధ్య కొండప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించేందుకు వెళ్లి.. కానరాని లోకాలకు వెళ్లారు కొంతమంది పర్యటకులు. చలికి తట్టుకోలేక, వాహనాల్లోనే ఇరుక్కుని 21 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటన పాకిస్థాన్​లో జరిగింది.

ఏమైందంటే..?

పాకిస్థాన్​, ఇస్లామాబాద్​కు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముర్రీ ప్రాంతం ప్రకృతి అందాలకు పెట్టిందిపేరు. అందుకే శీతాకాలంలో హిమపాతం నడుమ ఈ అందాలను ఆస్వాదించేందుకు వేల సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు.

ఈ ప్రాంతంలో శనివారం ఉష్ణోగ్రతలు మైనస్​ 8 డిగ్రీలకు పడిపోయాయి. మంచు భారీగా కురుస్తోంది. ఈ క్రమంలో పర్యటకులు కార్లలోనే ఇరుక్కుపోయారు. కార్లు మొత్తం మంచుతో నిండిపోయాయి. బయటకు వచ్చే పరిస్థితి లేదు. పర్యటకుల శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోయి (హైపోథెర్మియా) 21 మంది మృతిచెందారు.

మృతుల్లో ఇస్లామాబాద్​కు చెందిన ఓ పోలీస్ అధికారి కూడా ఉన్నారు. అంతేకాక మృతిచెందిన వారిలో 8 మంది ఆ పోలీస్​ అధికారి బంధువులే.

ఇప్పటికే వేల వాహనాలను మంచులోంచి బయటకు తీశామని.. ఇంకా కొన్ని తీస్తున్నామని స్థానిక మంత్రి షేక్ రషీద్ అహ్మద్​ తెలిపారు. ఒక్కరాత్రిలోనే ముర్రీ ప్రాంతాన్ని 4 అడుగుల మేర మంచుదుప్పటి కప్పేసిందన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో రాకపోకలను నిషేధించగా.. సహాయక చర్యలకోసం భద్రతా బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు.

మరోవైపు కార్లలో ఇరుక్కుని మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉందని, ఇలానే వాహనాల్లో ఇరుక్కున్న మరికొంతమందికి ఆహారం, దుప్పట్లను పంపిణీ చేస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 27లక్షల కరోనా కేసులు.. అమెరికాలో ఆగని ఉద్ధృతి

Last Updated : Jan 8, 2022, 6:34 PM IST

ABOUT THE AUTHOR

...view details