తెలంగాణ

telangana

ETV Bharat / international

దోపిడీలు, హత్యలు చేసి 20ఏళ్లు పరారీలో.. చివరికి.. - చైనా మహిళ వరుస హత్యలు

క్లబ్​లు, పబ్​లకు వచ్చే ధనవంతులకు స్వాగతం పలకటం ఆమె పని. అలా పార్టీలో ఎవరెవరు బడా వ్యక్తులో తెలుసుకుంటుంది. ఇంకేముంది.. తన బాయ్​ఫ్రెండ్​తో కలిసి వాళ్ల దగ్గర నగదును దోచుకోవటం, కిరాతకంగా ప్రాణాలు తీసేయటం చేస్తుంది. ఇప్పటికే ఏడుగురిని చంపిన ఆ మహిళకు.. 20ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఉరిశిక్ష విధించింది కోర్టు.

Chinese woman crime
ఏడుగురిని చంపి.. 20 ఏళ్లు దాక్కొని చివరికి

By

Published : Sep 11, 2021, 12:06 PM IST

చైనాలో వరుస హత్యలు చేస్తూ.. రోజుకో పేరు మారుస్తూ.. దాదాపు 20 ఏళ్లపాటు పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేసింది ఓ మహిళ. తన బాయ్​ఫ్రైండ్​తో కలిసి.. ఎన్నో నేరాలకు పాల్పడిన లావో రోంగ్జికి.. ఉరిశిక్ష ఖరారు చేసింది జియాంగ్జీ రాష్ట్రంలోని కోర్టు.

అంతేకాక ఆమె వ్యక్తిగత ఆస్తులను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఆమెకు రాజ్యాంగపరమైన హక్కులను కూడా రద్దు చేసింది. లావో కావాలనే వాళ్లను హత్యచేసినట్లు, ఆమె ప్రవర్తన క్రూరంగా ఉందని కోర్టు నిర్ధరించింది. ఈ క్రమంలో ఆమెకు ఉరిశిక్షను ఖరారు చేయగా.. ఇది విన్న లావో.. కోర్టులోనే ఏడ్చింది. పై కోర్టుకు అప్పీల్​కు వెళ్తానని పేర్కొంది.

బాయ్​ఫ్రెండ్​తో కలిసి..

1996-1999 మధ్యకాలంలో తన బాయ్​ఫ్రెండ్​ ఫా జియాంగ్​తో కలిసి ఏడుగురిని హతమార్చింది. అనేక దోపిడీలు, కిడ్నాప్​లకు పాల్పడింది లావో. ఫా జియాంగ్​ 1999లోనే హీఫీ ప్రాంతంలో పోలీసుల చేతికి చిక్కాడు. అతనికి కోర్టు ఉరిశిక్ష విధించింది.

ఆ తర్వాత లావో.. అదృశ్యమైంది. నకిలీ ధ్రువపత్రాలతో దేశంనుంచి పారిపోయేందుకు యత్నించి.. 20 ఏళ్ల తర్వాత చివరికి పోలీసులకు చిక్కింది. జియాంగ్జీ రాష్ట్రంలోని స్థానిక కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధించగా.. ఈ తీర్పుపై ఆమె పైకోర్టుకు అప్పీల్ చేస్తానని పేర్కొంది.

ఇదీ చదవండి:కూలిన సైనిక విమానం- లెఫ్టి​నెంట్​ కల్నల్ సహా ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details