తెలంగాణ

telangana

ETV Bharat / international

డ్రైవర్​ లెస్​ టాక్సీలో ప్రయాణం- ఆ థ్రిల్లే వేరూ!

చోదక రహిత కారులో ప్రయాణమంటే ఎంతో థ్రిల్లింగ్​గా ఉంటుంది. అయితే అందరూ ఈ కారును కొనుగోలు చేసి ప్రయాణించలేరు కదా! అలాంటి వారికోసమే టాక్సీ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది ఓ సంస్థ. అయితే భారత్​లో కాదు.. చైనాలో. మరి దాని ప్రత్యేకతలు.. విశేషాలేంటో చూద్దాం.

By

Published : May 3, 2021, 5:56 PM IST

driverless taxi
డ్రైవర్​ లెస్​ టాక్సీ

డ్రైవర్​ లెస్​ టాక్సీ

కృత్రిమ మేధతో నడిచే చోదక రహిత కారు టాక్సీలను తీసుకొచ్చింది చైనా టెక్​ దిగ్గజం బైడు. ఈ టాక్సీలను ఆదివారం ప్రారంభించింది. దీంతో తనంతట తానుగా నడిచే టాక్సీలను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి సంస్థగా నిలిచింది. ఈ టాక్సీలు డ్రైవర్ లేకుండానే.. ప్రయాణికులను గమ్యస్థానాలకు కచ్చితంగా, సురక్షితంగా చేర్చాయి. అయితే ప్రయాణికులు వెనుక సీటులో కూర్చోగా.. అత్యవసర సమయాల్లో సహాయం కోసం డ్రైవర్​ పక్కసీటులో ఓ భద్రతా సిబ్బంది కూర్చున్నారు.

ఒక్కరైడ్​కు 4.6 డాలర్లు

బీజింగ్​లోని షాంగాంగ్​ పార్క్​లో ఈ టాక్సీల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. పదికిపైగా అపోలా టాక్సీలు.. ప్రయాణికులను ఎక్కించుకుని, 3 చదరపు కిలోమీటర్లు పరిధిలో ఎనిమిది గమ్యస్థానాలకు చేర్చాయి. ఒక్కో రైడ్​కు 30 యూవన్లు (4.6 డాలర్లు) చొప్పున ఛార్జీ​ చేసింది ఆ సంస్థ.

థ్రిల్లింగ్​ రైడ్​..

రోబో కారులో ప్రయాణం చేసిన ఔత్సాహికులు.. తమకు ఎంతో థ్రిల్లింగ్​గా ఉందని చెబుతున్నారు.

అపోలో గో యాప్​

ఈ టాక్సీని 'అపోలో గో యాప్​' ద్వారా బుక్​ చేసుకోవచ్చు. టాక్సీ తమ దగ్గరకు చేరుకోగానే.. వారి గుర్తింపును ధ్రువీకరించి.. తమ హెల్త్​ కోడ్​ను స్కాన్​ చేసిన తర్వాత కారులోకి ఎక్కాలి. ప్రయాణికులు తమ సీటు బెల్ట్​​ ధరించి సౌకర్యంగా కూర్చున్న తర్వాతే కారు కదులుతుంది.

30 నగరాలకు విస్తరిస్తాం!

గతేడాది నుంచి బహిరంగ రహదారులపై చోదక రహిత కార్లను పరీక్షిస్తోంది బైడు. అపోలో గో రోబోటాక్సీ సేవల ద్వారా చైనాలోని మూడు నగరాల్లో 2 లక్షల 10 వేల మందికి పైగా ప్రయాణికులను తరలించిందని.. ఈ సేవలను రాబోయే మూడేళ్లలో 30 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చూడండి:చైనా యాప్​లకు ఇవి ప్రత్యామ్నాయం.. ట్రై చేయండి!

ABOUT THE AUTHOR

...view details