తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా ఎఫెక్ట్​:  చైనాలో మరిన్ని నగరాలకు రాకపోకలు బంద్ - in china ban busses

కరోనా మహమ్మారి ​బారిన పడే వారి సంఖ్య చైనాలో రోజురోజుకు పెరుగుతోంది. వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రయాణ ఆంక్షలు విధించిన డ్రాగన్​ దేశం.. తాజాగా తూర్పు షాండాంగ్​ రాష్ట్రం సహా మరో మూడు ప్రధాన నగరాల్లో దూర ప్రయాణ బస్సు సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

Chinese province, cities ban long-distance buses over virus concerns
కరోనా మహమ్మారి నియంత్రణకు చైనాలో కఠిన ఆంక్షలు

By

Published : Jan 26, 2020, 4:37 PM IST

Updated : Feb 25, 2020, 4:50 PM IST

వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు చైనా శతవిధాలా ప్రయత్నిస్తోంది. ప్రయాణ ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. తూర్పు షాండాంగ్ రాష్ట్రం సహా​ టియాంజిన్, బీజింగ్, జియాన్ ప్రాంతాల్లో పర్యటక​ , దూర ప్రాంత ప్రయాణ బస్సు సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో బస్సులకు అనుమతి లేదని ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

ఒకరి నుంచి మరొకరికి వైరస్​ వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రయాణ ఆంక్షలు విధించింది చైనా. తాజాగా ఎక్కువ జనాభా కలిగిన నాలుగు ప్రాంతాల్లో స్క్రీనింగ్ పరీక్షలు ​చేసే ఇంటర్​ సీటీ బస్సులను మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

రవాణా కారణంగానే వైరస్ విస్తరిస్తున్నందున ఈ రకమైన ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు చెప్పారు. చైనాలో ఇప్పటి వరకు కరోనా వైరస్​ బారిన పడి 56మంది మృతి చెందగా.. దాదాపు 2000మంది అస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

శాంటౌలోనూ రవాణాపై నిషేధాజ్ఞలు..

వైరస్​ను మొదటగా గుర్తించిన వుహాన్ ప్రాంత​ ప్రజలను ఆ పట్టణానికే పరిమితం చేసింది చైనా సర్కారు. వుహాన్​కు 1100 కిలోమీటర్ల దూరం ఉన్న శాంటౌలో సైతం రవాణాపై నిషేధాజ్ఞలు విధించారు. అత్యవసర సేవలు మినహా ఇతర వాహనాలను ఆదివారం అర్థరాత్రి నుంచి నిలిపివేయనున్నారు.

Last Updated : Feb 25, 2020, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details