తెలంగాణ

telangana

ETV Bharat / international

సరిహద్దు సమస్యలపై నేడు భారత్​-చైనా చర్చలు - సరిహద్దు సమస్యలపై భారత్​-చైనా చర్చలు

దిల్లీలో నేడు భారత్​-చైనా ప్రత్యేక ప్రతినిధుల సమావేశం జరగనుంది. ఇరుదేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యల పరిష్కారం కోసమై.. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​, చైనా విదేశాంగమంత్రి వాంగ్​ యీ ఈ చర్చల్లో పాల్గొననున్నారు.

Chinese Foreign Minister in India, to hold boundary talks with NSA
సరిహద్దు సమస్యలపై నేడు భారత్​-చైనా చర్చలు

By

Published : Dec 21, 2019, 6:04 AM IST

Updated : Dec 21, 2019, 10:31 AM IST

సరిహద్దు సమస్యలపై నేడు భారత్​-చైనా చర్చలు

భారత్​-చైనా సరిహద్దు సమస్యలపై చర్చించడానికి ప్రత్యేక ప్రతినిధుల సమావేశం నేడు దిల్లీలో జరగనుంది. ఈ 22వ సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​, చైనా విదేశాంగమంత్రి వాంగ్​ యీ చర్చలు జరపనున్నారు.

ఈ ఏడాది అక్టోబర్​లో మామల్లపురంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ అనధికారిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ప్రతిపాదిత ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్​సీఈపీ) నుంచి భారత్​ వైదొలిగింది. వీటి తరువాత భారత్​- చైనా మధ్య జరుగుతున్న మొదటి ఉన్నత స్థాయి సమావేశం ఇదే కావడం గమనార్హం. మోదీ-జిన్​పింగ్​ మధ్య జరిగిన రెండో అనధికారిక శిఖరాగ్ర సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలును ఇవాళ ఇరుపక్షాలు సమీక్షించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: 'భారత్​-చైనా మైత్రితోనే సరిహద్దు సమస్యకు పరిష్కారం'

అప్పుడు వాయిదా

ఈ సెప్టెంబర్​లోనే సరిహద్దు సమస్యల చర్చల కోసం వాంగ్​ భారతదేశాన్ని సందర్శించాల్సి ఉంది. కానీ అది వాయిదా పడింది. సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం ఇరుదేశాలు ఇప్పటికే 20 రౌండ్లపాటు చర్చలు జరిపాయి.

సరిహద్దు వివాదం

భారత్​-చైనాల మధ్య 3,488 కి.మీ పొడవైన సరిహద్దు ఉంది. అరుణాచల్​ ప్రదేశ్​ దక్షిణ టిబెట్​లో భాగమని చైనా వాదిస్తుండగా, భారత్​ దానిని ఖండిస్తోంది. ఇదే ఇరుదేశాల మధ్య ఉన్న వివాదం. అయితే సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతతను కాపాడుకోవడం అవసరమని ఇరుదేశాలు భావిస్తున్నాయి.

ఇదీ చూడండి: 'భారత్​-చైనా మైత్రితోనే సరిహద్దు సమస్యకు పరిష్కారం'

Last Updated : Dec 21, 2019, 10:31 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details