తెలంగాణ

telangana

By

Published : Dec 29, 2020, 5:15 PM IST

ETV Bharat / international

నేపాల్ ప్రతిపక్ష నేతలతో చైనా మంతనాలు

పార్లమెంటు రద్దుతో నేపాల్​లో ఏర్పడిన రాజకీయ అనిశ్చితికి తెరదించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు ప్రధాని ఓలీ, ప్రచండ సహా పలువురు నేతలతో చర్చలు జరిపింది. తాజాగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేపాలీ కాంగ్రెస్​ సారథి ఫేర్​ బహదూర్ దౌబాతో చైనా విదేశాంగ ప్రతినిధి మంగళవారం భేటీ అయ్యారు.

Chinese delegation resumes talks with Nepali leaders; meets NC leader Deuba
నేపాల్ ప్రతిపక్ష నేతలతో చైనా మంతనాలు

నేపాల్ రాజకీయ సంక్షోభంపై ఆ దేశ నేతలతో చర్చలు జరుపుతున్న చైనా.. తాజాగా ప్రతిపక్ష నేతలతో మంతనాలు సాగిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన నేపాలీ కాంగ్రెస్ అధినేత​ ఫేర్​ బహదూర్ దౌబాతో చైనా విదేశాంగ ప్రతినిధి జావో లిజియన్ మంగళవారం భేటీ అయ్యారు. నేపాల్-చైనా దౌత్య సంబంధాలు.. ప్రస్తుత రాజకీయ అనిశ్చితిపై ఇరు పక్షాలు చర్చలు జరిపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ సందర్భంగా దౌబాను వచ్చే ఏడాది జరిగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్​ చైనా శతజయంతి వేడుకలకు ఆహ్వానించారు లిజియన్.

ఇప్పటికే జావో... నేపాల్ అధ్యక్షురాలు విద్యా దేవీ భాండారి, ప్రధాని ఓలీ సహా వివిధ నేతలతో భేటీ అయ్యారు.

ఇదీ చూడండి :'నేపాల్​లో రాజకీయ సంక్షోభానికి త్వరలోనే తెర'

ABOUT THE AUTHOR

...view details