నేపాల్ రాజకీయ సంక్షోభంపై ఆ దేశ నేతలతో చర్చలు జరుపుతున్న చైనా.. తాజాగా ప్రతిపక్ష నేతలతో మంతనాలు సాగిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన నేపాలీ కాంగ్రెస్ అధినేత ఫేర్ బహదూర్ దౌబాతో చైనా విదేశాంగ ప్రతినిధి జావో లిజియన్ మంగళవారం భేటీ అయ్యారు. నేపాల్-చైనా దౌత్య సంబంధాలు.. ప్రస్తుత రాజకీయ అనిశ్చితిపై ఇరు పక్షాలు చర్చలు జరిపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ సందర్భంగా దౌబాను వచ్చే ఏడాది జరిగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా శతజయంతి వేడుకలకు ఆహ్వానించారు లిజియన్.
నేపాల్ ప్రతిపక్ష నేతలతో చైనా మంతనాలు - నేపాల్ రాజకీయ అనిశ్చితి
పార్లమెంటు రద్దుతో నేపాల్లో ఏర్పడిన రాజకీయ అనిశ్చితికి తెరదించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు ప్రధాని ఓలీ, ప్రచండ సహా పలువురు నేతలతో చర్చలు జరిపింది. తాజాగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేపాలీ కాంగ్రెస్ సారథి ఫేర్ బహదూర్ దౌబాతో చైనా విదేశాంగ ప్రతినిధి మంగళవారం భేటీ అయ్యారు.
![నేపాల్ ప్రతిపక్ష నేతలతో చైనా మంతనాలు Chinese delegation resumes talks with Nepali leaders; meets NC leader Deuba](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10047385-thumbnail-3x2-nepal.jpg)
నేపాల్ ప్రతిపక్ష నేతలతో చైనా మంతనాలు
ఇప్పటికే జావో... నేపాల్ అధ్యక్షురాలు విద్యా దేవీ భాండారి, ప్రధాని ఓలీ సహా వివిధ నేతలతో భేటీ అయ్యారు.
ఇదీ చూడండి :'నేపాల్లో రాజకీయ సంక్షోభానికి త్వరలోనే తెర'