ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చైనా ప్రభుత్వ అనుబంధ ఫార్మా సంస్థ సినోఫార్మా తెలిపింది. ఈ వ్యాక్సిన్(రెండు డోసులు) 140యువాన్ల(రూ. 10,782) కన్నా తక్కువ ఉంటుందని సంస్థ ఛైర్మన్ లియూ జింగ్జెన్ పేర్కొన్నారు.
దేశంలోని 1.4 బిలియన్ మంది ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని.. పెద్ద పెద్ద నగరాల్లోని విద్యార్థులు, ఉద్యోగులకు టీకా అందించాలని వెల్లడించారు జింగ్జెన్.