కొంత దూరమే అయినా నడిచి వెళ్లడానికి ఒక్కోసారి కొందరు ఎంతో ఆయాస పడుతూ ఉంటారు. చెమటలు కక్కుతూ అలిసిపోతుంటారు. మాకా ఇబ్బంది ఏమీ లేదంటోంది చైనాలోని ఓ ఏనుగుల గుంపు. వందల కిలోల భారీ కాయంతో ఈ ఏనుగుల గుంపు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 500 కిలోమీటర్లు నడుస్తూ ప్రయాణం చేశాయి మరి. గత ఏడాది యువాన్ ఫ్రావిన్స్లోని నేచర్ రిజర్వ్ నుంచి బయటకు వచ్చిన 16 అడవి ఏనుగులు ఏకమై ఈ దూరాన్ని నడిచాయి. 15 నెలలుగా అనేక పట్టణాల గుండా వీటి ప్రయాణం సాగుతుండగా.. ప్రస్తుతం ఇవి 70 లక్షల జనాభా గల కున్మింగ్ నగరానికి సమీపంలో ఉన్నాయి. 16 ఏనుగుల్లో రెండు తిరిగి వెనక్కి వెళ్లి పోగా, మధ్యలో ఓ పిల్ల ఏనుగు పుట్టడం వల్ల ప్రస్తుతం 15 ఏనుగుల గుంపు సంచరిస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్..
ఏనుగుల గుంపు ప్రయాణం ఆరంభమైన నాటి నుంచి ప్రపంచ మీడియా వీటిపై దృష్టి సారించింది. ఫలితంగా.. ట్విట్టర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు ఈ ఏనుగులు గుంపు వీడియోలతో నిండి పోయాయి. గుంపులోని మూడు పిల్ల ఏనుగుల చేష్టలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మనం కూడా ఏనుగుల లాగా ఐక్యంగా ఉండి ఒకరికొకరు రక్షణగా ఉందామంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. చైనాలోని ప్రముఖ సామాజిక మాధ్యమం విబోలో కొన్ని రోజులుగా ఈ ఏనుగుల గుంపు అంశం ట్రెండింగ్లో ఉంది. ఈ బృందం ఆదమరచి నిద్రపోతున్న దృశ్యాలకు సోమవారం రాత్రి వరకు 25 వేల పోస్టులు రాగా, ఇవి 200 మిలియన్ల వ్యూస్లను సొంతం చేసుకున్నాయి.
నిపుణుల పర్యవేక్షణలో ఏనుగుల ప్రయాణం