తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​​-పాక్​ చేతులు కలపాలన్నదే మా కోరిక : చైనా - చైనా రాయబారి సన్ వీడాంగ్

ఉపఖండంలో శాంతి, సుస్థిరతలను పెంపొందించేందుకు భారత్​-పాక్​లు చేతులు కలపాలని చైనా కోరుకుంటోందని ఆ దేశ రాయబారి సన్​ వీడాంగ్ పేర్కొన్నారు. భారత్​-చైనా చర్చలు మరింత పురోగతి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.​

భారత్​​-పాక్​ చేతులు కలపాలన్నదే మా కోరిక : చైనా

By

Published : Oct 20, 2019, 6:10 AM IST

Updated : Oct 20, 2019, 8:29 AM IST

భారత్​​-పాక్​ చేతులు కలపాలన్నదే మా కోరిక : చైనా

భారత్​-పాకిస్థాన్​ సత్సంబంధాలు కలిగి ఉండాలని, శాంతి, సుస్థిరతలను పెంపొందించడానికి ఇరుదేశాలు చేతులు కలపాలని.. చైనా కోరుకుంటున్నట్లు భారత్​లోని ఆ దేశ రాయబారి సన్​ వీడాంగ్​ పేర్కొన్నారు. చైనా-భారత్​ల మధ్య కూడా చర్చలు మరింత పురోగతి చెందాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపఖండం అభివృద్ధికి భారత్​-చైనా కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​, భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్య ఇటీవల జరిగిన రెండో అనధికారిక చర్చల తరువాత సన్​ వీడాంగ్​ కీలక వ్యాఖ్యలు చేశారు.

"చైనా-భారత్​, చైనా-పాకిస్థాన్​, భారత్​-పాక్​ల మధ్య మంచి సంబంధాల కోసం హృదయపూర్వకంగా ఎదురుచూస్తున్నామని చైనా నొక్కి చెప్పింది. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడానికి ఇరుదేశాలు కృషిచేయాలని, ప్రాంతీయ అభివృద్ధి, శ్రేయస్సు కోసం దాయాది దేశాలు చేతులు కలపాలని మేము ఆశిస్తున్నాం."- సన్​ వీడాంగ్, భారత్​లోని చైనా రాయబారి

'పుల్వామా'తో మొదలైంది...

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో పాక్ ఆధారిత జైషే మహమ్మద్​ ఉగ్రవాదులు చేసిన దాడిలో 40 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లు మరణించారు. ఫలితంగా భారత్​-పాక్​ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫలితంగా బాలాకోట్​లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానికదళం దాడి చేసి నాశనం చేసింది. దీనిపై పాకిస్థాన్​ తనపైన జరిగిన దాడిగా అభివర్ణించింది.

ఆర్టికల్ 370 రద్దుతో

జమ్ము కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే ఆర్టికల్ 370ని భారత్​ రద్దుచేసింది. దీనిని తీవ్రంగా​ వ్యతిరేకిస్తోన్న పాక్​.. అంతర్జాతీయ వేదికలపై భారత్ వ్యతిరేక వాదనలు వినిపించింది. అయితే పాక్​కు చైనా తప్ప మిగిలిన సూపర్ పవర్​ దేశాలైన రష్యా, ఫ్రాన్స్, అమెరికా మద్దతు లభించలేదు. కశ్మీర్ భారత అంతర్గత విషయమని ఆయా దేశాలు తేల్చిచెప్పాయి.

జిన్​పింగ్​- ఇమ్రాన్​ చర్చలు

భారత్​ పర్యటనకు వచ్చే ముందు చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తో పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ భేటీ అయ్యారు. ఇమ్రాన్​తో పాక్ ప్రధాన సైన్యాధికారి కూడా ఉన్నారు. వీరు కశ్మీర్​, సీపెక్​ల గురించి చర్చించారు.

ఈ చర్యను భారత్​ ఖండించింది. కశ్మీర్ భారత అంతర్గత విషయమని తేల్చిచెప్పింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని నిర్మూలించిన తరువాతనే చర్చలు జరిపే అవకాశముందని స్పష్టం చేసింది. చేసేది లేక చైనా.. ఇరుదేశాలు శాంతం వహించాలని చెప్పడం ప్రారంభించింది.

పాక్​....సార్క్ ఎత్తుగడ

ఆసక్తికరంగా, సార్క్​ శిఖరాగ్ర సమావేశానికి తాము ఆతిథ్యం ఇస్తామని పాక్​ ప్రకటించింది. ఈ సమావేశానికి సభ్యదేశమైన భారత్​ను కూడా ఆహ్వానించే అవకాశముంది. అయితే ఇంతకు ముందు దక్షిణాసియా ప్రాంతీయ ఫోరం​లోనూ.. పాక్ వేసిన ఎత్తుగడలు ఫలితం ఇవ్వలేకపోయాయి.

ఇదీ చూడండి:సీతాకోక చిలుకల పలకరింపు.. ప్రకృతి పరవశింపు!

Last Updated : Oct 20, 2019, 8:29 AM IST

ABOUT THE AUTHOR

...view details