తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా కల్లోలం: చైనాలో 1765కు చేరిన మృతులు - చైనా వైరస్​

కరోనా వైరస్​ నానాటికి విజృంభిస్తోంది. చైనాలో వైరస్​తో మృతి చెందిన వారి సంఖ్య 1765కు చేరింది. తాజాగా 1,933 కొత్త కేసులు నమోదయ్యాయి.

China virus toll reaches 1,765: govt
కరోనా కల్లోలం: చైనాలో 1765కు చేరిన మృతులు

By

Published : Feb 17, 2020, 5:31 AM IST

Updated : Mar 1, 2020, 2:11 PM IST

ప్రాణాంతక కరోనా వైరస్​తో చైనా అతలాకుతలమవుతోంది. మహమ్మారి ధాటికి హుబే ప్రావిన్స్​లో తాజాగా 100మందికిపైగా ప్రాణాలు కోల్పోవడం వల్ల మృతుల సంఖ్య 1765కు చేరింది. 1,933 నూతన కేసులు నమోదైనట్టు చైనా ఆరోగ్యశాఖ తన నివేదికలో పేర్కొంది. ఇప్పటి వరకు 70,400 మందికి ఈ వైరస్​ సోకినట్టు స్పష్టం చేసింది.

వైరస్​ కేంద్ర బిందువైన వుహాన్​ మినహా.. చైనావ్యాప్తంగా వైరస్​ కేసులు తగ్గుతున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే కరోనా ఎప్పుడు ఎలా విజృంభిస్తుందో చెప్పలేమని.. నిత్యం అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) సూచించింది.

నౌకలోని ఆ 40మందికి...

మరోవైపు జపాన్​లో నిర్బంధంలో ఉన్న నౌకలోని 40మంది అమెరికన్లకు వైరస్​ సోకినట్టు నిర్ధరించారు. నౌకలోని అమెరికా పౌరులను తరలించేందుకు ఏర్పాటు చేసిన కార్యకలాపాల నుంచి ఈ 40మంది దూరంగా ఉండనున్నట్టు అగ్రరాజ్యం స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:-'క్రూయిజ్​షిప్'​లో మరో ఇద్దరు భారతీయులకు కరోనా

Last Updated : Mar 1, 2020, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details