తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా పంజా: చైనాలో 2 వేలకు చేరిన మృతులు

చైనాలో కరోనా మహమ్మారికి మరో 132 మంది బలయ్యారు. వీరితో కలిపి బుధవారం నాటికి కరోనా బాధితుల మరణాల సంఖ్య 2,000కు చేరింది. చైనాలో కరోనా సోకిన వారి సంఖ్య 74,000 దాటింది.

By

Published : Feb 19, 2020, 6:40 AM IST

Updated : Mar 1, 2020, 7:23 PM IST

China virus death toll
కరోనా వైరస్ మృతుల సంఖ్య

ప్రాణాంతక కరోనా వైరస్ చైనాను వణికిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ఇప్పటి వరకు 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్​ తీవ్రత అధికంగా ఉన్న హుబె రాష్ట్రంలో తాజాగా 132 మంది వైరస్​కు బలయ్యారు.

చైనా రోజువారీ నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం.. 1,693 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకింది. వీరితో కలిపి చైనాలో వైరస్​ సోకిన వారి సంఖ్య 74,000 దాటింది.

మంగళవారంతో పోలిస్తే కరోనా బాధితుల మరణాలు బుధవారం కాస్త పెరిగాయి. ఇదే సమయంలో హుబె రాష్ట్రంలో కొత్త కేసులు వారంలోనే అత్యల్పంగా నమోదయ్యాయి.

Last Updated : Mar 1, 2020, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details