తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా కల్లోలం: చైనాలో 1483కు చేరిన మృతుల సంఖ్య - covid 19

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొవిడ్-19 (కరోనా) వైరస్ కారణంగా చైనాలో గురువారం ఒక్కరోజే 116 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మృతుల సంఖ్య 1483 కు చేరింది. నూతనంగా 4823 మంది కొవిడ్ బారిన పడ్డారని సమాచారం.

covid 19
కొవిడ్ 19తో ఒక్కరోజే 116మంది మృతి

By

Published : Feb 14, 2020, 7:36 AM IST

Updated : Mar 1, 2020, 7:05 AM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది కొవిడ్-19 (కరోనా) వైరస్. వ్యాధి కేంద్రస్థానమైన చైనాలో గురువారం ఒక్కరోజే 116 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాణాంతక మహమ్మారి ధాటికి మొత్తంగా 1483 మంది అసువులు బాశారు. 4823 నూతన కేసులు నమోదయ్యాయని.. మొత్తంగా 64,600 మందికి వ్యాధి లక్షణాలు నిర్ధరణ అయినట్లు వెల్లడించారు.

సరైన సమయంలో చికిత్స అందించేందుకు వీలుగా వ్యాధి నిర్ధరణ పరీక్షలను త్వరితగతిన పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు హూబీ అధికారులు. అయితే చైనా అధికారులు ప్రకటించిన దానికంటే ఎక్కువగానే వ్యాధి ప్రబలుతోందని సమాచారం.

ఇదీ చూడండి:కొవిడ్-19 భయాలున్నా నౌకకు ఆహ్వానం.. ఆ దేశానికి సలాం!

Last Updated : Mar 1, 2020, 7:05 AM IST

ABOUT THE AUTHOR

...view details