తెలంగాణ

telangana

'ఆర్​సెప్​పై స్ఫూర్తివంతమైన పురోగతి.. కానీ'

By

Published : Nov 4, 2019, 6:16 PM IST

ఆర్​సెప్​పై స్ఫూర్తివంతమైన పురోగతి సాధించినప్పటికీ... ఒప్పందం కుదుర్చుకోవడానికి అది సరిపోదని అభిప్రాయపడింది చైనా. త్వరలోనే ఒప్పందంపై సంతకాలు చేయడానికి సభ్య దేశాలు కృషి చేయనున్నట్టు తెలిపింది.

'ఆర్​సెప్​పై స్ఫూర్తిమంతమైన పురోగతి.. కానీ'

బ్యాంకాక్​లోని ఆసియాన్​ సమావేశంలో భాగంగా.. ఆర్​సెప్​ ఒప్పందంపై సంప్రదింపులు ఎంతో స్ఫూర్తివంతమైన పురోగతిని సాధించాయని అభిప్రాయపడింది చైనా. అయితే ఈ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం.. సభ్య దేశాల అంచనాలను ఇంకా అందుకోలేదని తెలిపింది.

ఒప్పందం కుదిరితే.. చైనా చౌక ధర సరుకులు భారత్​లోకి వెల్లువెత్తుతాయని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేసిన కొన్ని రోజులకు డ్రాగన్​ దేశం ఈ ప్రకటన చేసింది.

'ఒప్పందం కుదుర్చుకోవడానికి సాగిన చర్చలు.. సభ్యదేశాల అంచనాలు అందుకోలేకపోయాయి. కానీ ఈసారి ఎంతో స్ఫూర్తివంతమైన పురోగతి సాధించాం. త్వరగా ఒప్పందంపై సంతకాలు చేయడానికి సభ్యదేశాలు కృషి చేయాలని నిర్ణయించాయి.'
--- జెంగ్​​ షుయాంగ్​, చైనా విదేశాంగ ప్రతినిధి.

ఆసియా-పసిఫిక్​ ప్రాంతంలో ఆర్​సెప్​ ఎంతో ముఖ్యమైన ఒప్పందమని అభిప్రాయపడ్డారు జెంగ్. ​

భారత్‌ నుంచి న్యూజిలాండ్‌ వరకు 16 దేశాల మధ్య ఆర్​సీఈపీ ఒప్పందం కుదరాల్సి ఉంది. ప్రపంచంలో సగం జనాభా ఈ దేశాల్లోనే ఉంది. మార్కెట్‌ అందుబాటు సంబంధిత చర్చలు చాలావరకు పూర్తయ్యాయని, కొద్దిపాటి ద్వైపాక్షిక అంశాలు 2020 ఫిబ్రవరి నాటికి కొలిక్కి వస్తాయని ముసాయిదా ఒప్పందంలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి:-ఆర్​సీఈపీ ఒప్పందం ఇప్పుడు లేనట్లే..!

ABOUT THE AUTHOR

...view details