'కరోనాను కట్టడి చేసేశాం' అని చైనా అధికారులు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్త సమస్య వచ్చి పడింది. విదేశాల నుంచి వివిధ మార్గాల్లో వస్తున్న వారితో మళ్లీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈశాన్య ప్రాంతంలోని హిలోంగ్జియాంగ్ ప్రావిన్స్లోకి రష్యా నుంచి వచ్చిన వారిలో మంగళవారం 79 కేసులు నమోదవడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు.
'ఒకరిని పట్టిస్తే... రూ. 54 వేలు బహుమతిగా ఇస్తాం' - Russia Border Crossers
చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నూతన బాధితులందరూ విదేశాల నుంచి వచ్చిన వారేనని గుర్తించారు అక్కడి అధికారులు. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం దేశంలోకి అక్రమంగా వచ్చిన వారిని పట్టిస్తే నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు.
!['ఒకరిని పట్టిస్తే... రూ. 54 వేలు బహుమతిగా ఇస్తాం' A reward of 5,000 yuan for taking out the pirates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6809249-thumbnail-3x2-asp.jpg)
ఒకరిని పట్టిస్తే... రూ. 54 వేలు
దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారి ఆచూకీ తెలుసుకుని, ఆరోగ్య పరీక్షలు చేస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని నిర్ణయించారు. సరిహద్దుల్లో ఎంత నిఘా ఉంచినా చొరబాట్లు ఆగడంలేదు. ఈ నేపథ్యంలో అక్రమంగా వచ్చిన వారిని పట్టించినా, ఆచూకీ చెప్పినా 5,000 యువాన్ల(మన కరెన్సీలో రూ.54 వేలు) నగదు ఇస్తామని అధికారులు ప్రకటించారు.