తెలంగాణ

telangana

By

Published : Jun 11, 2020, 5:47 PM IST

ETV Bharat / international

సరిహద్దు సమస్యకు సామరస్యంగానే పరిష్కారం: చైనా

భారత్​- చైనాలు సరిహద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటున్నట్లు తెలిపారు చైనా విదేశాంగ శాఖ సీనియర్​ అధికారి. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు రెండు దేశాలు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. దౌత్య, సైనిక స్థాయి చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరినట్లు పేర్కొన్నారు.

China, India properly handling' border issue, taking actions to ease situation: Chinese foreign min
'సామరస్యంగా భారత్​-చైనా సరిహద్దు వివాద పరిష్కారం'

భారత్​- చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు రెండు దేశాలు చర్యలు తీసుకుంటున్నాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్​యింగ్​ తెలిపారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటున్నామన్నారు. రెండు దేశాల మధ్య దౌత్య, సైనిక స్థాయి చర్చల అనంతరం ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. ఆ ప్రకారమే ముందుకు సాగుతున్నట్లు వివరించారు.

ఉద్రిక్తతలు తగ్గించేందుకు క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు చున్​యింగ్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. తూర్పు లద్దాఖ్​లో సరిహద్దు సమస్యపై భారత్​- చైనా సైనికాధికారులు జరిపిన చర్చలు సత్ఫలితాలిచ్చాయని తెలిసిన మరునాడే ఈ విషయంపై స్పందించారు చున్​యింగ్. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న బలగాలను పరిమిత సంఖ్యలో ఉపసంహరించుకునేందుకు రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం.

జూన్​ 6న నాలుగున్నర గంటల పాటు సాగిన మేజర్- జనరల్​ స్థాయి చర్చల్లో.. పాంగోంగ్​ సహా వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించిన వేలాది బలగాలను చైనా తక్షణమే ఉపసంహరించుకోవాలని భారత్​ కోరినట్లు అధికారులు తెలిపారు.

గాల్వన్ లోయ సహా పలు ప్రాంతాల్లోని చైనా బలగాలు 1.5 కి.మీ మేర వెనక్కి మళ్లినట్లు సైన్యం అధికారిక వర్గాలు మంగళవారం తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details