తెలంగాణ

telangana

ETV Bharat / international

మెరుపు వేగంతో కరోనా పంజా.. వుహాన్​ రాకపోకలపై ఆంక్షలు - కరోనా వైరస్​ తాజా వార్తలు

అంతుచిక్కని కరోనా వైరస్​ బారిన పడి చైనాలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 17కి చేరింది. వైరస్​ వేగంగా వ్యాపిస్తోన్న తీరుపై ఇతర దేశాల్లోనూ కలవరం వ్యక్తమవుతోంది. వైరస్​ కేంద్రబిందువుగా భావిస్తోన్న చైనా వుహాన్​ నగరం రాకపోకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

China halts flights and trains
మెరుపు వేగంతో కరోనా పంజా... వుహాన్​ రాకపోకలపై ఆంక్షలు

By

Published : Jan 23, 2020, 5:36 AM IST

Updated : Feb 18, 2020, 1:58 AM IST

మెరుపు వేగంతో కరోనా పంజా.. వుహాన్​ రాకపోకలపై ఆంక్షలు

కొత్తరకానికి చెందిన కరోనా వైరస్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. మెరుపు వేగంతో పంజా విసురుతోన్న కరోనాను కట్టడి చేసేందుకు చైనా ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతోంది.

ఈ వైరస్​కు కేంద్ర బిందువుగా భావిస్తోన్న వుహాన్​ నగరానికి విమాన, రైలు సర్వీసులను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రత్యేక కారణం లేకుండా స్థానికులు బయటికి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది.

పొంచి ఉన్న ముప్పు...

ఈ నెల 24 నుంచి వారం రోజుల పాటు చైనాలో నూతన సంవత్సర సెలవులు రానున్నాయి. ఆ సమయంలో లక్షల మంది చేసే ప్రయాణాలతో వ్యాధి తీవ్రత మరింత పెరుగుతుందని భయపడుతున్నారు అధికారులు. ఏటా ఈ సెలవుల సమయంలో రైళ్లు, రోడ్డు మార్గాలు కిక్కిరిసిపోతుంటాయి. విమానాలకు తాకిడి గరిష్ఠంగా ఉంటుంది.

దాదాపు 700 మంది భారతీయులు...

కోటి పైచిలుకు జనాభా ఉన్న వుహాన్​లో భారత్​కు చెందినవారు దాదాపు 700 మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే. నగరాన్ని వీడి వెళ్లిపోవాలా వద్దా అనే విషయంలో దౌత్య కార్యాలయ సూచన కోసం వీరు నిరీక్షిస్తున్నారు.

డబ్ల్యూహెచ్​ఓ అత్యవసర భేటీ...

కరోనా వైరస్​ వేర్వేరు దేశాలకు సోకే ప్రమాదం ఉండటం వల్ల జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశం నిర్వహించింది. స్వైన్​ఫ్లూ, ఎబోలా తరహాలో దీనిపైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించే అవకాశాన్ని ఈ సంస్థ పరిశీలిస్తోంది.

Last Updated : Feb 18, 2020, 1:58 AM IST

ABOUT THE AUTHOR

...view details