తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనా సర్కారుపై ఆ దేశ సైనికుల కుటుంబాల ఆగ్రహం

గల్వాన్​ లోయ ఘటన నేపథ్యంలో సొంత ప్రజల నుంచే చైనా ప్రభుత్వానికి వ్యతిరేకత ఎదురవుతోందని అమెరికా వార్తా సంస్థ నివేదించింది. ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల వివరాలు బయటపెట్టకపోవడమే ఇందుకు కారణంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో సైనికుల కుటుంబ సభ్యులు.. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టు స్పష్టం చేసింది.

By

Published : Jun 28, 2020, 5:43 PM IST

జవాన్ల కుటుంబాలను శాంతిపజేయడానికి చైనా అష్టకష్టాలు
China failing to silence upset families of soldiers killed in Galwan face-off

గల్వాన్​ ఘటనలో మరణించిన సైనికుల వివరాలను చైనా ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టలేదు. పలువురు మృతిచెందారని ఓ ప్రకటన విడుదల చేసిందే తప్ప.. ఇప్పటి వరకు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు చైనా కమ్యూనిస్ట్​ పార్టీ. ఈ విషయంపై సొంత ప్రజల నుంచే ప్రభుత్వానికి వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన బ్రియట్​బార్ట్​ న్యూస్​ నివేదించింది.

నివేదిక ప్రకారం.. ఘర్షణలో మరణించిన చైనా సైనికుల కుటుంబాలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. తమ వారికి తగిన గౌరవం దక్కలేదని ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై వైబో సహా ఇతర సామాజిక మాధ్యల ద్వారా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వారిని శాంతిపజేయడానికి చైనా ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. అయినా ఫలితం దక్కడం లేదు.

చైనా దుస్సాహసం..

మే నెల నుంచి భారత్​-చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపుచేయడానికి సమస్యాత్మక ప్రాంతాల నుంచి సైనికులను వెనక్కి రప్పించాలని ఇరు దేశాల నిర్ణయించాయి. అయితే చైనీయులు మాత్రం ఈ నెల 15న గల్వాల్​ లోయలో భారత జవాన్లపై దుస్సాహసానికి పాల్పడ్డారు. ఈ వార్త బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే.. 20మంది భారత జవాన్లు వీరమరణం పొందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆయా రాష్ట్రాల్లో ఆ 20మందికి ఘనంగా వీడ్కోలు పలికారు ప్రజలు. కానీ చైనా మాత్రం.. మరణించిన తమ జవాన్ల వివరాలను వెల్లడించలేదు. అయితే గల్వాన్​ ఘటనలో చైనావైపు 43మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని భారత్ అం​చనా వేస్తోంది.

ఇదీ చూడండి:-సరిహద్దులో యుద్ధ మేఘాలు- క్షిపణులు మోహరిస్తున్న భారత్!

ABOUT THE AUTHOR

...view details