నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా హాంగ్కాంగ్లో జరుగుతున్న నిరసనలను అణిచి వేయటానికి చైనా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని సామాజిక మాధ్యమాల దిగ్గజాలు ట్విట్టర్, ఫేస్బుక్ గుర్తించాయి. హాంగ్కాంగ్ నిరసనలను అణిచివేయడం, రాజకీయ మార్పు కోసం పిలుపు వంటి అంశాలపై చైనా చేస్తున్న దుష్ప్రచారాలను ట్వీట్టర్ బయటపెట్టింది. ఈ విషయానికి సంబంధించిన వివరాలు అన్ని సేకరించినట్టు తెలిపింది.
"ఇదొక ప్రభుత్వ మద్దతు ఆపరేషన్ అని మా దర్యాప్తులో తేలింది. కొన్ని ఖాతాలు ఒక పద్ధతి ప్రకారం హాంగ్కాంగ్ నిరసనలకు వ్యతిరేకంగా సమాచారాలు పంపుతున్నాయి. వార్తా సంస్థలుగా నకిలీ ఖాతాలను తెరిచాయి. వాటి సందేశాలతో ప్రజలకు ఆకర్షించాయి. ఈ వ్యవహారంలో చైనాకు చెందిన అధికారులు ఉన్నట్లు గుర్తించాము."
-ట్విట్టర్.